లబ్ధిదారులకు వాహనాలు.. బీమా పరిహారం అందజేత
లబ్ధిదారులకు వాహనాలు.. బీమా పరిహారం అందజేత
K.RAVI
తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో చెక్కులు, రుణాల పంపిణీ
రూ. 40 లక్షల బీమా చెక్కు అందించిన ఆర్ఎమ్ ఉదయ్
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో సోమవారం రుణాల పంపిణీ, బీమా చెక్కుల అందజేత కార్యక్రమం ఘనంగా జరిగింది. భువనగిరి రీజినల్ మేనేజర్ ఉదయ్ ముక్తాపురం లబ్ధిదారులకు వాహనాలను, బాధిత కుటుంబానికి బీమా పరిహారాన్ని అందజేశారు.అగ్రి యోజన పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు ఒక ట్రాక్టర్, రెండు అశోక్ లేలాండ్ మినీ వాహనాలను అందించినట్లు ఆర్ఎమ్ ఉదయ్ తెలిపారు. అలాగే, ఎస్బీఐ ప్రమాద బీమా పథకంలో రూ.2 వేల ప్రీమియం చెల్లించి దురదృష్టవశాత్తూ మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి రూ.40 లక్షల పరిహారం చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్రి యోజన ద్వారా రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. స్వయం శక్తి పథకం కింద మహిళలకు కోటి రూపాయలకు పైగా రుణాలు అందించిన ఏకైక శాఖగా చౌటుప్పల్ బ్రాంచ్ నిలిచిందని కొనియాడారు. ఫిక్స్డ్ డిపాజిట్లపై, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు ఇస్తున్నామని, బ్యాంకు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ వేడుకలో చీఫ్ మేనేజర్లు సుదేష్ రెడ్డి, అన్వేష్, చౌటుప్పల్ బ్రాంచ్ మేనేజర్ మురళిబాబు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి