Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతి శిశువుకు తొలి ఆహారం తల్లిపాలే – ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తల్లిపాల ప్రాధాన్యతను ప్రతి కుటుంబం గుర్తించాలి: జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 03, 2026 09:46 PM

లబ్ధిదారులకు వాహనాలు.. బీమా పరిహారం అందజేత

లబ్ధిదారులకు వాహనాలు.. బీమా పరిహారం అందజేత

లబ్ధిదారులకు వాహనాలు.. బీమా పరిహారం అందజేత
August 03, 2026 07:20 PM 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో చెక్కులు, రుణాల పంపిణీ

రూ. 40 లక్షల బీమా చెక్కు అందించిన ఆర్‌ఎమ్ ఉదయ్

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో సోమవారం రుణాల పంపిణీ, బీమా చెక్కుల అందజేత కార్యక్రమం ఘనంగా జరిగింది. భువనగిరి రీజినల్ మేనేజర్ ఉదయ్ ముక్తాపురం లబ్ధిదారులకు వాహనాలను, బాధిత కుటుంబానికి బీమా పరిహారాన్ని అందజేశారు.అగ్రి యోజన పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు ఒక ట్రాక్టర్, రెండు అశోక్ లేలాండ్ మినీ వాహనాలను అందించినట్లు ఆర్‌ఎమ్ ఉదయ్ తెలిపారు. అలాగే, ఎస్‌బీఐ ప్రమాద బీమా పథకంలో రూ.2 వేల ప్రీమియం చెల్లించి దురదృష్టవశాత్తూ మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి రూ.40 లక్షల పరిహారం చెక్కును అందజేశారు.​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్రి యోజన ద్వారా రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. స్వయం శక్తి పథకం కింద మహిళలకు కోటి రూపాయలకు పైగా రుణాలు అందించిన ఏకైక శాఖగా చౌటుప్పల్ బ్రాంచ్ నిలిచిందని కొనియాడారు. ఫిక్స్డ్ డిపాజిట్లపై, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు ఇస్తున్నామని, బ్యాంకు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.​ఈ వేడుకలో చీఫ్ మేనేజర్లు సుదేష్ రెడ్డి, అన్వేష్, చౌటుప్పల్ బ్రాంచ్ మేనేజర్ మురళిబాబు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News