ఉద్యమకారుడు గంధమల్ల బాలయ్య మృతి తీరని లోటు. ప్రభుత్వాలు ఉద్యమకారులకు న్యాయం చేయాలి: ఎస్.కె. చాంద్.
ఉద్యమకారుడు గంధమల్ల బాలయ్య మృతి తీరని లోటు. ప్రభుత్వాలు ఉద్యమకారులకు న్యాయం చేయాలి: ఎస్.కె. చాంద్.
Editor Desk
రామన్నపేట,
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు గంధమల్ల బాలయ్య మృతి ఉద్యమకారులకు తీరని లోటని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్.కె. చాంద్ అన్నారు. బాలయ్య మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలి, మలిదశ ఉద్యమాల్లో గంధమల్ల బాలయ్య విశేషంగా పోరాడారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం డాక్టర్ చీమ శ్రీనివాస్ నాయకత్వంలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ, గత మూడేళ్లుగా అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు.
ఉద్యమకారులు ఒక్కొక్కరుగా దూరమవుతున్నా, వారి సంక్షేమంపై ప్రభుత్వాలు తగిన దృష్టి పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాలయ్య అకాల మరణం ఉద్యమకారులందరికీ తీవ్ర విషాదాన్ని మిగిల్చిందన్నారు. వారి కుటుంబానికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శీలం స్వామి, రామన్నపేట మండల అధ్యక్షుడు నోముల శంకర్, ఉపాధ్యక్షుడు బొడ్డుపల్లి లింగయ్య, గంధమల్ల రవి తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి