Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సీసీ రోడ్డు పనులకు శ్రీకారం.. దోసపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా: సర్పంచ్ బిరాదర్ దత్తు కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 03, 2026 06:39 PM

ఉద్యమకారుడు గంధమల్ల బాలయ్య మృతి తీరని లోటు. ప్రభుత్వాలు ఉద్యమకారులకు న్యాయం చేయాలి: ఎస్.కె. చాంద్.

ఉద్యమకారుడు గంధమల్ల బాలయ్య మృతి తీరని లోటు. ప్రభుత్వాలు ఉద్యమకారులకు న్యాయం చేయాలి: ఎస్.కె. చాంద్.

ఉద్యమకారుడు గంధమల్ల బాలయ్య మృతి తీరని లోటు.  ప్రభుత్వాలు ఉద్యమకారులకు న్యాయం చేయాలి: ఎస్.కె. చాంద్.
August 03, 2026 04:38 PM 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు గంధమల్ల బాలయ్య మృతి ఉద్యమకారులకు తీరని లోటని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్.కె. చాంద్ అన్నారు. బాలయ్య మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలి, మలిదశ ఉద్యమాల్లో గంధమల్ల బాలయ్య విశేషంగా పోరాడారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం డాక్టర్ చీమ శ్రీనివాస్ నాయకత్వంలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ, గత మూడేళ్లుగా అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు.

ఉద్యమకారులు ఒక్కొక్కరుగా దూరమవుతున్నా, వారి సంక్షేమంపై ప్రభుత్వాలు తగిన దృష్టి పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాలయ్య అకాల మరణం ఉద్యమకారులందరికీ తీవ్ర విషాదాన్ని మిగిల్చిందన్నారు. వారి కుటుంబానికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శీలం స్వామి, రామన్నపేట మండల అధ్యక్షుడు నోముల శంకర్, ఉపాధ్యక్షుడు బొడ్డుపల్లి లింగయ్య, గంధమల్ల రవి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News