Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతి శిశువుకు తొలి ఆహారం తల్లిపాలే – ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తల్లిపాల ప్రాధాన్యతను ప్రతి కుటుంబం గుర్తించాలి: జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 03, 2026 11:34 PM

సీఐటీయూ రాష్ట్ర కమిటీ సమావేశాలు విజయవంతం చేయాలి – కార్మికులకు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మాయ కృష్ణ పిలుపు

సీఐటీయూ రాష్ట్ర కమిటీ సమావేశాలు విజయవంతం చేయాలి – కార్మికులకు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మాయ కృష్ణ పిలుపు

సీఐటీయూ రాష్ట్ర కమిటీ సమావేశాలు విజయవంతం చేయాలి – కార్మికులకు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మాయ కృష్ణ పిలుపు
August 03, 2026 08:40 PM 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి టౌన్, ఆగస్టు 3 (ప్రతినిధి):

ఆగస్టు 16, 17, 18 తేదీల్లో భువనగిరిలో నిర్వహించనున్న సీఐటీయూ రాష్ట్ర కమిటీ సమావేశాలను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మాయ కృష్ణ కార్మికులకు పిలుపునిచ్చారు.

సోమవారం భువనగిరిలో మున్సిపల్ కార్మికులు, వివిధ రంగాల కార్మికులు, స్కీమ్ వర్కర్లను ఉద్దేశించి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

భువనగిరిలో మూడు రోజుల పాటు జరిగే రాష్ట్ర కమిటీ సమావేశాలకు అఖిల భారత, రాష్ట్ర నాయకత్వంతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై సమావేశాల్లో సమగ్రంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నట్లు వెల్లడించారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మికుల హక్కులను బలహీనపరిచిందని మాయ కృష్ణ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు.

జీవో ఎంఎస్ నెం.6లో ఉన్న లోపాలను సవరించి, శాస్త్రీయంగా కనీస వేతనాలను పునర్నిర్ణయించి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరారు.

భువనగిరిలో జరగనున్న రాష్ట్ర కమిటీ సమావేశాల విజయవంతానికి కార్మికులు, ప్రజలు తమ వంతు ఆర్థిక, నైతిక సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సల్ల రాజయ్య, పాకాల శోభ, గంగారపు పద్మ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News