సీఐటీయూ రాష్ట్ర కమిటీ సమావేశాలు విజయవంతం చేయాలి – కార్మికులకు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మాయ కృష్ణ పిలుపు
సీఐటీయూ రాష్ట్ర కమిటీ సమావేశాలు విజయవంతం చేయాలి – కార్మికులకు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మాయ కృష్ణ పిలుపు
Editor Desk
భువనగిరి టౌన్, ఆగస్టు 3 (ప్రతినిధి):
ఆగస్టు 16, 17, 18 తేదీల్లో భువనగిరిలో నిర్వహించనున్న సీఐటీయూ రాష్ట్ర కమిటీ సమావేశాలను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మాయ కృష్ణ కార్మికులకు పిలుపునిచ్చారు.
సోమవారం భువనగిరిలో మున్సిపల్ కార్మికులు, వివిధ రంగాల కార్మికులు, స్కీమ్ వర్కర్లను ఉద్దేశించి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
భువనగిరిలో మూడు రోజుల పాటు జరిగే రాష్ట్ర కమిటీ సమావేశాలకు అఖిల భారత, రాష్ట్ర నాయకత్వంతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై సమావేశాల్లో సమగ్రంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నట్లు వెల్లడించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మికుల హక్కులను బలహీనపరిచిందని మాయ కృష్ణ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు.
జీవో ఎంఎస్ నెం.6లో ఉన్న లోపాలను సవరించి, శాస్త్రీయంగా కనీస వేతనాలను పునర్నిర్ణయించి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరారు.
భువనగిరిలో జరగనున్న రాష్ట్ర కమిటీ సమావేశాల విజయవంతానికి కార్మికులు, ప్రజలు తమ వంతు ఆర్థిక, నైతిక సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సల్ల రాజయ్య, పాకాల శోభ, గంగారపు పద్మ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి