గోదాంలో వరి ధాన్యాన్ని వెంటనే తరలించండి
గోదాంలో వరి ధాన్యాన్ని వెంటనే తరలించండి
K.RAVI
లక్క పురుగుల ముప్పు నుంచి ప్రజలను కాపాడాలి
కలెక్టర్కు చౌటుప్పల్ 17వ వార్డు కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి వినతి
చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ గోదాంలో నిల్వ ఉంచిన వరి ధాన్యాన్ని త్వరితగతిన ఖాళీ చేసి, స్థానిక నివాసితులను లక్క పురుగుల తీవ్రత నుంచి రక్షించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ను చౌటుప్పల్ పురపాలక సంఘం 17వ వార్డు కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి- సాయిలు కోరారు. ఈ మేరకు ఆమె కలెక్టర్కు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.
గత కొంతకాలంగా వ్యవసాయ మార్కెట్ గోదాంలో భారీగా వరి ధాన్యం నిల్వ ఉండటంతో లక్క పురుగులు విపరీతంగా వ్యాపిస్తున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. సమీప వార్డుల ప్రజలు, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఈ పురుగుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రోగాల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణమే స్పందించి, ధాన్యాన్ని వేరే ప్రాంతానికి తరలించేలా చర్యలు తీసుకోవాలని, మార్కెట్ ఆవరణలో క్రిమిసంహారక మందులు పిచికారీ చేయించి ప్రజారోగ్యాన్ని కాపాడాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి