చైన్ స్నాచర్లపై ఉక్కుపాదం. ఘటనాస్థలాన్ని పరిశీలించిన వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి..
చైన్ స్నాచర్లపై ఉక్కుపాదం. ఘటనాస్థలాన్ని పరిశీలించిన వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి..
Editor Desk
నిందితుల పట్టివేతకు ప్రత్యేక బృందాలకు ఆదేశాలు.
నాగోల్, ఆగస్టు 4:
చర్చిలో ప్రార్థనలు ముగించుకుని ఇంటికి వెళ్తున్న మహిళ మెడలోని సుమారు రెండున్నర తులాల బంగారు పుస్తెల గొలుసును పల్సర్ బైక్పై వచ్చిన ముగ్గురు దుండగులు లాక్కెళ్లిన ఘటన నాగోల్ పోలీస్స్టేషన్ పరిధిలోని తట్టి అన్నారం ప్రాంతంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.
జీవీఆర్ కాలనీకి చెందిన సాగ్గం ధనమ్మ (56) ఫిర్యాదు మేరకు నాగోల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సమాచారం అందుకున్న వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ఘటనాస్థలంతో పాటు దుండగులు పరారైన మార్గాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
"నిందితుల ఆచూకీ కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. త్వరలోనే వారిని అదుపులోకి తీసుకొస్తాం" అనే దిశగా పోలీసులు చర్యలు వేగవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి