ఆటో ప్రమాద బాధితులకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ
ఆటో ప్రమాద బాధితులకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ
Harish K
నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన పలువురు నాటు కూలీలు కూలి పనుల నిమిత్తం ఆటోలో ప్రయాణిస్తుండగా, మార్గమధ్యలో మంగళవారం రత్నవరం గ్రామం సమీపంలో ఆటో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పదకుండు మంది కూలీలు గాయపడగా,వారిని వెంటనే కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ విషయం తెలుసుకున్న కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకోవడంతో పాటు, బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సంబంధిత అధికారులను కోరారు.అలాగే, ప్రమాదంలో గాయపడిన కూలీలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ,వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి