Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేపటి నుండి ఉచిత యోగ శిక్షణా తరగతులు కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 04, 2026 06:09 PM

ఆటో ప్రమాద బాధితులకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ

ఆటో ప్రమాద బాధితులకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ

ఆటో ప్రమాద బాధితులకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ
August 04, 2026 04:16 PM 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన పలువురు నాటు కూలీలు కూలి పనుల నిమిత్తం ఆటోలో ప్రయాణిస్తుండగా, మార్గమధ్యలో మంగళవారం రత్నవరం గ్రామం సమీపంలో ఆటో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పదకుండు మంది కూలీలు గాయపడగా,వారిని వెంటనే కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ విషయం తెలుసుకున్న కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకోవడంతో పాటు, బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సంబంధిత అధికారులను కోరారు.అలాగే, ప్రమాదంలో గాయపడిన కూలీలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ,వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News