న్యాయవాదుల విధుల బహిష్కరణ
న్యాయవాదుల విధుల బహిష్కరణ
K.RAVI
న్యాయవాది మల్లయ్య హత్యను నిరసిస్తూ చౌటుప్పల్ కోర్టు ఎదుట ధర్నా
న్యాయవాది మల్లయ్య దారుణ హత్యను నిరసిస్తూ చౌటుప్పల్ కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. మంగళవారం చౌటుప్పల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు భవనం ఎదుట న్యాయవాదులు నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా చౌటుప్పల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తాడూరి పరమేష్ మాట్లాడుతూ.. కల్వకుర్తి కోర్టు న్యాయవాది మల్లయ్యను దారుణంగా హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల భద్రత కోసం ‘అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్’ను ప్రభుత్వం కఠినంగా అమలు చేయాలని కోరారు. సమాజంలో న్యాయం కోసం పోరాడే న్యాయవాదులపై వరుసగా దాడులు జరగడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సహాయ కార్యదర్శి మక్తల నరసింహా, కార్యవర్గ సభ్యులు ఎండి ఖయ్యూం పాషా, పిల్లలమర్రి కిరణ్, మాజీ అధ్యక్షులు బాల్యం వెంకట చలపతి, తడక మోహన్, రాపోలు వేణు, జల్ల రమేష్, జక్కార్థి శేఖర్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి