రామన్నపేట: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) అండగా నిలుస్తోందని నకిరేకల్ ఎమ్మెల్యే, తెలంగాణ ప్రభుత్వ విప్ వేముల వీరేశం తెలిపారు. ఆయన సహకారంతో మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను రామన్నపేట మండలం శోభనాద్రిపురం గ్రామానికి చెందిన పోషబోయిన నరసింహ, ఇప్ప మౌనికలకు అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అర్హులైన ప్రతి బాధితుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. సీఎం సహాయనిధి పేదలకు అత్యవసర సమయంలో ఆర్థిక భరోసాగా నిలుస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కంచి మధుసూదన్, పంచాయతీ కార్యదర్శి పవన్ కుమార్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఏటెళ్లి పరమేష్, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు సతీష్, సునీత, రమణ, లతీఫ్, అంజమ్మ, కుమారస్వామి, మేకల స్వామి, మాజీ సర్పంచ్ బొడిగే చంద్రకళ శ్రీనివాస్ గౌడ్, ఫీల్డ్ అసిస్టెంట్ నంగునూరు నరేష్, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, తాడూరి సైదులు, సాయి గౌడ్, సైదులు, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి