యూరియా బుకింగ్పై కొత్త ఆంక్షలు. ఎకరాల వారీగా విడతలు.. రెండు బుకింగ్ల మధ్య 20 రోజుల విరామం.
యూరియా బుకింగ్పై కొత్త ఆంక్షలు. ఎకరాల వారీగా విడతలు.. రెండు బుకింగ్ల మధ్య 20 రోజుల విరామం.
Editor Desk
హైదరాబాద్,: రైతులకు యూరియా పంపిణీని నియంత్రితంగా, అవసరానికి అనుగుణంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యూరియా బుకింగ్ విధానంలో కీలక మార్పులు చేసింది. పై అధికారుల ఆదేశాల మేరకు రాష్ట్ర యాప్లో కొత్త నిబంధనలను వెంటనే అమల్లోకి తీసుకొచ్చింది.
కొత్త విధానం ప్రకారం రెండు ఎకరాల వరకు సాగు చేస్తున్న రైతులు అవసరమైన యూరియాను ఒకేసారి బుక్ చేసుకోవచ్చు. రెండు నుంచి ఐదు ఎకరాల వరకు సాగు ఉన్న రైతులకు రెండు విడతల్లో, ఐదు ఎకరాల కంటే ఎక్కువ సాగు ఉన్న వారికి 40 శాతం, 30 శాతం, 30 శాతం చొప్పున మూడు విడతల్లో యూరియా బుకింగ్ అవకాశం కల్పించారు.
అంతేకాకుండా, రెండు వరుస యూరియా బుకింగ్ల మధ్య తప్పనిసరిగా 20 రోజుల వ్యవధి ఉండేలా నిబంధన విధించారు. కొత్త మార్గదర్శకాలు రాష్ట్ర యాప్లో ఇప్పటికే అమల్లోకి రావడంతో రైతులకు అవగాహన కల్పించి, వాటి ప్రకారమే బుకింగ్లు చేపట్టాలని క్షేత్రస్థాయి వ్యవసాయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
2 ఎకరాల వరకు – ఒకేసారి పూర్తి యూరియా బుకింగ్
2–5 ఎకరాలు – రెండు విడతల్లో బుకింగ్.
5 ఎకరాల పైన – 40:30:30 నిష్పత్తిలో మూడు విడతలు
రెండు బుకింగ్ల మధ్య 20 రోజుల విరామం తప్పనిసరి
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి