Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలి కలెక్టరేట్‌ను ముట్టడించిన ఎస్‌ఎఫ్‌ఐ నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 06, 2026 07:51 PM

యువతకు బంగారు భవితకు ‘మై భారత్’. జులై 1–ఆగస్టు 15 వరకు ప్రత్యేక నమోదు 15–29 ఏళ్ల యువతకు కేంద్రం పిలుపు.

యువతకు బంగారు భవితకు ‘మై భారత్’. జులై 1–ఆగస్టు 15 వరకు ప్రత్యేక నమోదు 15–29 ఏళ్ల యువతకు కేంద్రం పిలుపు.

యువతకు బంగారు భవితకు ‘మై భారత్’.  జులై 1–ఆగస్టు 15 వరకు ప్రత్యేక నమోదు 15–29 ఏళ్ల యువతకు కేంద్రం పిలుపు.
July 06, 2026 05:49 PM 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యువత ప్రతిభకు పదును పెట్టి దేశాభివృద్ధిలో భాగస్వాములను చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘మై భారత్’ పోర్టల్‌కు విశేష స్పందన లభిస్తోంది. 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత ఈ పోర్టల్‌లో నమోదు చేసుకుని కెరీర్, నైపుణ్యాభివృద్ధి, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహనతో పాటు జాతీయ స్థాయి అవకాశాలను పొందవచ్చని అధికారులు తెలిపారు.పదో తరగతి ఉత్తీర్ణులైన యువత వాలంటీర్లుగా నమోదు చేసుకుని సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల్లో భాగస్వాములు కావచ్చన్నారు. పోర్టల్ ద్వారా యువతకు వివిధ రంగాల నిపుణులు, పారిశ్రామికవేత్తలతో మమేకమయ్యే అవకాశాలు కూడా కల్పిస్తున్నారు.హైదరాబాద్ జిల్లాకు చెందిన అభిరూప్ గౌండ్, రామ, విశ్వకర్మ రాజు, వైష్ణవ్, ప్రణీత్ తదితరులు ‘మై భారత్’ పోర్టల్‌లో నమోదు చేసుకుని ‘వికసిత్ భారత్–వైబ్రెంట్ బార్డర్ విలేజ్’ ఆన్‌లైన్ క్విజ్‌లో విజేతలుగా నిలిచారు. అనంతరం ఉత్తరాఖండ్ సరిహద్దు గ్రామాలను సందర్శించి అక్కడి ప్రజల జీవన విధానాన్ని ప్రత్యక్షంగా అధ్యయనం చేసే అవకాశం పొందారు.హైదరాబాద్ జిల్లాలో ఇప్పటికే 55 వేల మందికి పైగా యువత ‘మై భారత్’లో నమోదు చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. మరింత మంది యువతను చేర్చేందుకు జులై 1 నుంచి ఆగస్టు 15 వరకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక నమోదు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా యువజన అధికారి శశాంక్ రావుల మాట్లాడుతూ, అర్హులైన యువత అందరూ ‘మై భారత్’ పోర్టల్‌లో నమోదు చేసుకుని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News