Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:06 AM

యువతకు బంగారు భవితకు ‘మై భారత్’. జులై 1–ఆగస్టు 15 వరకు ప్రత్యేక నమోదు 15–29 ఏళ్ల యువతకు కేంద్రం పిలుపు.

యువతకు బంగారు భవితకు ‘మై భారత్’. జులై 1–ఆగస్టు 15 వరకు ప్రత్యేక నమోదు 15–29 ఏళ్ల యువతకు కేంద్రం పిలుపు.

యువతకు బంగారు భవితకు ‘మై భారత్’.  జులై 1–ఆగస్టు 15 వరకు ప్రత్యేక నమోదు 15–29 ఏళ్ల యువతకు కేంద్రం పిలుపు.
06-07-2026 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యువత ప్రతిభకు పదును పెట్టి దేశాభివృద్ధిలో భాగస్వాములను చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘మై భారత్’ పోర్టల్‌కు విశేష స్పందన లభిస్తోంది. 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత ఈ పోర్టల్‌లో నమోదు చేసుకుని కెరీర్, నైపుణ్యాభివృద్ధి, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహనతో పాటు జాతీయ స్థాయి అవకాశాలను పొందవచ్చని అధికారులు తెలిపారు.పదో తరగతి ఉత్తీర్ణులైన యువత వాలంటీర్లుగా నమోదు చేసుకుని సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల్లో భాగస్వాములు కావచ్చన్నారు. పోర్టల్ ద్వారా యువతకు వివిధ రంగాల నిపుణులు, పారిశ్రామికవేత్తలతో మమేకమయ్యే అవకాశాలు కూడా కల్పిస్తున్నారు.హైదరాబాద్ జిల్లాకు చెందిన అభిరూప్ గౌండ్, రామ, విశ్వకర్మ రాజు, వైష్ణవ్, ప్రణీత్ తదితరులు ‘మై భారత్’ పోర్టల్‌లో నమోదు చేసుకుని ‘వికసిత్ భారత్–వైబ్రెంట్ బార్డర్ విలేజ్’ ఆన్‌లైన్ క్విజ్‌లో విజేతలుగా నిలిచారు. అనంతరం ఉత్తరాఖండ్ సరిహద్దు గ్రామాలను సందర్శించి అక్కడి ప్రజల జీవన విధానాన్ని ప్రత్యక్షంగా అధ్యయనం చేసే అవకాశం పొందారు.హైదరాబాద్ జిల్లాలో ఇప్పటికే 55 వేల మందికి పైగా యువత ‘మై భారత్’లో నమోదు చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. మరింత మంది యువతను చేర్చేందుకు జులై 1 నుంచి ఆగస్టు 15 వరకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక నమోదు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా యువజన అధికారి శశాంక్ రావుల మాట్లాడుతూ, అర్హులైన యువత అందరూ ‘మై భారత్’ పోర్టల్‌లో నమోదు చేసుకుని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Sthanikam

యువతకు బంగారు భవితకు ‘మై భారత్’. జులై 1–ఆగస్టు 15 వరకు ప్రత్యేక నమోదు 15–29 ఏళ్ల యువతకు కేంద్రం పిలుపు.

Article Image

యువత ప్రతిభకు పదును పెట్టి దేశాభివృద్ధిలో భాగస్వాములను చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘మై భారత్’ పోర్టల్‌కు విశేష స్పందన లభిస్తోంది. 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత ఈ పోర్టల్‌లో నమోదు చేసుకుని కెరీర్, నైపుణ్యాభివృద్ధి, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహనతో పాటు జాతీయ స్థాయి అవకాశాలను పొందవచ్చని అధికారులు తెలిపారు.పదో తరగతి ఉత్తీర్ణులైన యువత వాలంటీర్లుగా నమోదు చేసుకుని సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల్లో భాగస్వాములు కావచ్చన్నారు. పోర్టల్ ద్వారా యువతకు వివిధ రంగాల నిపుణులు, పారిశ్రామికవేత్తలతో మమేకమయ్యే అవకాశాలు కూడా కల్పిస్తున్నారు.హైదరాబాద్ జిల్లాకు చెందిన అభిరూప్ గౌండ్, రామ, విశ్వకర్మ రాజు, వైష్ణవ్, ప్రణీత్ తదితరులు ‘మై భారత్’ పోర్టల్‌లో నమోదు చేసుకుని ‘వికసిత్ భారత్–వైబ్రెంట్ బార్డర్ విలేజ్’ ఆన్‌లైన్ క్విజ్‌లో విజేతలుగా నిలిచారు. అనంతరం ఉత్తరాఖండ్ సరిహద్దు గ్రామాలను సందర్శించి అక్కడి ప్రజల జీవన విధానాన్ని ప్రత్యక్షంగా అధ్యయనం చేసే అవకాశం పొందారు.హైదరాబాద్ జిల్లాలో ఇప్పటికే 55 వేల మందికి పైగా యువత ‘మై భారత్’లో నమోదు చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. మరింత మంది యువతను చేర్చేందుకు జులై 1 నుంచి ఆగస్టు 15 వరకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక నమోదు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా యువజన అధికారి శశాంక్ రావుల మాట్లాడుతూ, అర్హులైన యువత అందరూ ‘మై భారత్’ పోర్టల్‌లో నమోదు చేసుకుని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News