Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 07:16 AM

ఒవైసీ విద్యాసంస్థలు ఎఫ్‌టీఎల్‌లో లేవా..? ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు

ఒవైసీ విద్యాసంస్థలు ఎఫ్‌టీఎల్‌లో లేవా..? ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు

ఒవైసీ విద్యాసంస్థలు ఎఫ్‌టీఎల్‌లో లేవా..? ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు
July 11, 2026 06:18 AM 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

మ్యాప్‌లు ఒకటి చెబుతుంటే.. ప్రభుత్వ నివేదిక మరోలా ఎందుకు..?

సల్కం చెరువు పరిధిలో ఉన్న ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థల భవనానికి సంబంధించిన ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) వివాదంపై తెలంగాణ హైకోర్టులో విచారణ సందర్భంగా ప్రభుత్వం సమర్పించిన నివేదికపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. రెవెన్యూ, నీటిపారుదల శాఖలు సమర్పించిన నివేదికలో సంబంధిత భవనం ఎఫ్‌టీఎల్ పరిధిలో లేదని పేర్కొనడాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది.

విచారణ సందర్భంగా ధర్మాసనం పలు కీలక ప్రశ్నలు లేవనెత్తింది. గూగుల్ మ్యాప్స్, ఇతర రికార్డులు పరిశీలిస్తే ఆక్రమణ జరిగినట్లు కనిపిస్తోందని, అలాంటప్పుడు ప్రభుత్వం ఎలాంటి ఆధారాలతో భవనం ఎఫ్‌టీఎల్‌లో లేదని నివేదిక సమర్పించిందని ప్రశ్నించింది. గతంలో ఉన్న ఎఫ్‌టీఎల్ పరిమితి ఇప్పుడు ఎలా తగ్గిందని కూడా అధికారులను నిలదీసింది.

చెరువుల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రా (HYDRAA) ఈ వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకుందని ధర్మాసనం ప్రశ్నించింది. చెరువుల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతుంటే, ఈ కేసులో సంబంధిత శాఖల స్పందన ఏమిటని వివరణ కోరింది.

అదే సమయంలో మున్సిపల్ శాఖ, హెచ్‌ఎండీఏ అధికారులు ఇప్పటివరకు సమగ్ర నివేదిక సమర్పించకపోవడంపైనా హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. చెరువు ఎఫ్‌టీఎల్‌కు సంబంధించిన తుది నోటిఫికేషన్ ఎందుకు జారీ కాలేదని, సంబంధిత రికార్డులను కోర్టు ముందు ఎందుకు ఉంచలేదని ప్రశ్నించింది.

విచారణ సందర్భంగా ప్రభుత్వ చర్యలపై కూడా ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసినట్లు కోర్టు ప్రక్రియలో వెల్లడైంది. చట్టం అందరికీ సమానంగా వర్తించాలని, ఎలాంటి నిర్మాణమైనా నిబంధనలకు విరుద్ధంగా ఉంటే సంబంధిత అధికారులు ఒకే విధమైన ప్రమాణాలు పాటించాలని సూచించింది. ఎంపిక చేసిన నిర్మాణాలపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నారనే అభిప్రాయం కలగకుండా ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరించాలని ధర్మాసనం పేర్కొంది.

ఈ కేసులో గతంలో జారీ చేసిన స్టేటస్‌కో ఉత్తర్వులను కూడా హైకోర్టు ఉపసంహరించుకుంది. తదుపరి విచారణలో సంబంధిత శాఖలు పూర్తి వివరాలతో కూడిన నివేదికలు సమర్పించాలని ఆదేశించింది. సల్కం చెరువు పరిధిలోని భూ రికార్డులు, ఎఫ్‌టీఎల్ పరిమితులు, సంబంధిత మ్యాపులు, అధికారిక నోటిఫికేషన్ల ఆధారంగా తదుపరి విచారణ కొనసాగనున్నట్లు కోర్టు పేర్కొంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News