డయల్-100 స్థానంలో కొత్త ఎమర్జెన్సీ నంబర్ ప్రారంభం
రాష్ట్రంలో అత్యవసర సేవలను మరింత వేగవంతం చేసేందుకు డయల్-100 స్థానంలో '112' అనే ఏకైక ఎమర్జెన్సీ నంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ సేవలను ఆయన బుధవారం ప్రారంభించారు.
Lఇకపై పోలీస్, అంబులెన్స్, అగ్నిమాపక తదితర అన్ని అత్యవసర సేవల కోసం ప్రజలు 112 నంబర్కే కాల్ చేయాలని సూచించారు. ఈ నంబర్ను ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్లో సేవ్ చేసుకోవాలని డీజీపీ పిలుపునిచ్చారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు మరింత వేగంగా సేవలు అందించేందుకు వ్యవస్థను ఆధునికీకరించినట్లు తెలిపారు. ఒకేసారి 960 కాల్స్ స్వీకరించే సామర్థ్యంతో వ్యవస్థను అప్గ్రేడ్ చేసినట్లు వెల్లడించారు. దీంతో అత్యవసర సమయాల్లో కాల్స్కు వేగంగా స్పందించే అవకాశం కలుగుతుందని అధికారులు పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి