Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:51 AM

జాతీయ లోక్ అదాలత్ విజయవంతానికి సమన్వయ సమావేశం.

జాతీయ లోక్ అదాలత్ విజయవంతానికి సమన్వయ సమావేశం.

జాతీయ లోక్ అదాలత్ విజయవంతానికి సమన్వయ సమావేశం.
06-06-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఈ నెల 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేసేందుకు శనివారం రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టు హాలులో సమన్వయ సమావేశం నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి–కమ్–చైర్మన్, మండల న్యాయ సేవల కమిటీ అధ్యక్షురాలు జి. సబిత అధ్యక్షతన జరిగిన సమావేశంలో లోక్ అదాలత్ నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

రాజీ ద్వారా పరిష్కరించదగిన కేసులను గుర్తించడం, సంబంధిత పక్షాలకు అవగాహన కల్పించడం, వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం తదితర అంశాలపై అధికారులు అభిప్రాయాలు పంచుకున్నారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా ప్రజలు తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో తమ వివాదాలకు శాశ్వత పరిష్కారం పొందవచ్చని జి. సబిత పేర్కొన్నారు. లోక్ అదాలత్ విజయవంతానికి సంబంధిత శాఖల అధికారులు, పోలీసు సిబ్బంది పూర్తి సహకారం అందించాలని ఆమె సూచించారు.

సమావేశంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్. శిరీష, అదనపు జూనియర్ సివిల్ జడ్జి వి. రత్నకుమారి, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ డి. సత్తయ్య, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎన్. వెంకటేశ్వర్లు, రామన్నపేట ఎస్‌ఐ నాగరాజు, అడ్డగూడూరు ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు

Sthanikam

జాతీయ లోక్ అదాలత్ విజయవంతానికి సమన్వయ సమావేశం.

Article Image

ఈ నెల 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేసేందుకు శనివారం రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టు హాలులో సమన్వయ సమావేశం నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి–కమ్–చైర్మన్, మండల న్యాయ సేవల కమిటీ అధ్యక్షురాలు జి. సబిత అధ్యక్షతన జరిగిన సమావేశంలో లోక్ అదాలత్ నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

రాజీ ద్వారా పరిష్కరించదగిన కేసులను గుర్తించడం, సంబంధిత పక్షాలకు అవగాహన కల్పించడం, వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం తదితర అంశాలపై అధికారులు అభిప్రాయాలు పంచుకున్నారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా ప్రజలు తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో తమ వివాదాలకు శాశ్వత పరిష్కారం పొందవచ్చని జి. సబిత పేర్కొన్నారు. లోక్ అదాలత్ విజయవంతానికి సంబంధిత శాఖల అధికారులు, పోలీసు సిబ్బంది పూర్తి సహకారం అందించాలని ఆమె సూచించారు.

సమావేశంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్. శిరీష, అదనపు జూనియర్ సివిల్ జడ్జి వి. రత్నకుమారి, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ డి. సత్తయ్య, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎన్. వెంకటేశ్వర్లు, రామన్నపేట ఎస్‌ఐ నాగరాజు, అడ్డగూడూరు ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News