జాతీయ లోక్ అదాలత్ విజయవంతానికి సమన్వయ సమావేశం.
జాతీయ లోక్ అదాలత్ విజయవంతానికి సమన్వయ సమావేశం.
Editor Desk
ఈ నెల 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేసేందుకు శనివారం రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టు హాలులో సమన్వయ సమావేశం నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి–కమ్–చైర్మన్, మండల న్యాయ సేవల కమిటీ అధ్యక్షురాలు జి. సబిత అధ్యక్షతన జరిగిన సమావేశంలో లోక్ అదాలత్ నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
రాజీ ద్వారా పరిష్కరించదగిన కేసులను గుర్తించడం, సంబంధిత పక్షాలకు అవగాహన కల్పించడం, వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం తదితర అంశాలపై అధికారులు అభిప్రాయాలు పంచుకున్నారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా ప్రజలు తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో తమ వివాదాలకు శాశ్వత పరిష్కారం పొందవచ్చని జి. సబిత పేర్కొన్నారు. లోక్ అదాలత్ విజయవంతానికి సంబంధిత శాఖల అధికారులు, పోలీసు సిబ్బంది పూర్తి సహకారం అందించాలని ఆమె సూచించారు.
సమావేశంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్. శిరీష, అదనపు జూనియర్ సివిల్ జడ్జి వి. రత్నకుమారి, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ డి. సత్తయ్య, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్. వెంకటేశ్వర్లు, రామన్నపేట ఎస్ఐ నాగరాజు, అడ్డగూడూరు ఎస్ఐ వెంకట్రెడ్డి పాల్గొన్నారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి