99 రోజుల ప్రజాపాలన విజయవంతానికి ప్రజలు సహకరించాలి. సర్పంచ్ పులిపలుపుల సునీత వీరస్వామి
99 రోజుల ప్రజాపాలన విజయవంతానికి ప్రజలు సహకరించాలి. సర్పంచ్ పులిపలుపుల సునీత వీరస్వామి
Editor Desk
రామన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని లక్ష్మాపురం సర్పంచ్ పులిపలుపుల సునీత వీరస్వామి పిలుపునిచ్చారు, లక్ష్మాపురం గ్రామాoలో నిర్వహించిన అవగాహన సదస్సుల్లో ఆమె పాల్గొని మాట్లాడారు.
ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఈ సదస్సులు దోహదపడతాయని ఆమె పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, తాగునీటి సంరక్షణ వంటి అంశాల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ఎంపీడీవో ఎ. రాములు గ్రామాల్లో పరిశుభ్రత, ప్లాస్టిక్ నిర్మూలన, తాగునీటి సదుపాయాలపై అవగాహన కల్పించారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సీజన్కు అనుగుణంగా పంటల సాగుపై సూచనలు అందించారు, ఆర్ఐ శోభ జనాభా గణన ప్రాధాన్యాన్ని వివరించగా, పోలీసు శాఖ అధికారులు రోడ్డు భద్రత, మత్తు పదార్థాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. హౌసింగ్ శాఖ అధికారులు గృహ నిర్మాణాల పురోగతిని వివరించారు.
ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి ఎం.డి. రావూఫ్ అలీ, మండల వ్యవసాయ అధికారి ఎం.డి. అజాజ్ అలీ ఖాన్, విద్యుత్ శాఖ ఏఈ కోటేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రాఘవ, హౌసింగ్ ఏఈ సురేష్, ఈజీఎస్ ఏపీఓ పి. వెంకన్న, పంచాయతీ కార్యదర్శి ఎన్. విఠల్కుమార్, జీపీఓ అనిత, ఈజీఎస్ ఎఫ్ఏ చంద్రయ్య, అంగన్వాడీ టీచర్లు, వైద్య సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి