Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలి – మాణిక్ రావు పటేల్‌కు శుభాకాంక్షలు ధర్మవరం వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ బదిలీ రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 06, 2026 04:20 PM

నల్గొండలో ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు.. ఉద్రిక్తతకు దారి తీసిన అర్ధరాత్రి ఘటన

నల్గొండలో ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు.. ఉద్రిక్తతకు దారి తీసిన అర్ధరాత్రి ఘటన

నల్గొండలో ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు.. ఉద్రిక్తతకు దారి తీసిన అర్ధరాత్రి ఘటన
June 06, 2026 03:00 PM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

గుర్తు తెలియని వ్యక్తుల దుశ్చర్య.. స్వల్పంగా దెబ్బతిన్న తల భాగం.. పెయింటింగ్‌తో ఆనవాళ్లు తొలగించిన మున్సిపల్ సిబ్బంది.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు

నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రముఖ నేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఘటన కలకలం రేపింది. అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనలో విగ్రహం తల భాగం స్వల్పంగా కాలిపోయినట్లు గుర్తించారు. ఉదయం స్థానికులు గమనించి అధికారులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ఘటన సమాచారం అందుకున్న మున్సిపల్ అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని దగ్ధమైన భాగానికి పెయింటింగ్ వేయించి విగ్రహాన్ని యథాతథ స్థితికి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. అయితే ఈ ఘటన రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

విగ్రహానికి నిప్పు పెట్టిన వారెవరు, వారి ఉద్దేశ్యం ఏమిటన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.జిల్లా కేంద్రంలో ప్రముఖ వ్యక్తి విగ్రహంపై జరిగిన ఈ దుశ్చర్య స్థానికంగా ఆందోళనకు కారణమైంది. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు ప్రజాప్రతినిధులు, ఎన్టీఆర్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు త్వరలోనే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News