నిదానపల్లి,
గ్రామాభివృద్ధికి తనవంతు సహకారంగా నిదానపల్లి గ్రామ 5వ వార్డు సభ్యుడు ఏకుల మల్లేశం గ్రామపంచాయతీ కార్యాలయానికి గోడ గడియారాన్ని శనివారం బహుకరించారు. సర్పంచ్ నారపాక మాధవి–యాదయ్య, పంచాయతీ కార్యదర్శి సుమన్కు ఆయన గడియారాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా గోడ గడియారం అందించడం అభినందనీయమన్నారు. గ్రామ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు కలిసి పనిచేస్తే మరింత మంచి ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు.
గ్రామ సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి