Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలి – మాణిక్ రావు పటేల్‌కు శుభాకాంక్షలు ధర్మవరం వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ బదిలీ రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 06, 2026 05:14 PM

ప్రజాపాలనతో గ్రామాభివృద్ధి సాధ్యం. 99 రోజుల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య

ప్రజాపాలనతో గ్రామాభివృద్ధి సాధ్యం. 99 రోజుల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య

ప్రజాపాలనతో గ్రామాభివృద్ధి సాధ్యం. 99 రోజుల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య
June 06, 2026 03:47 PM 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని గ్రామాభివృద్ధికి సహకరించాలని నిదానపల్లి సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య పిలుపునిచ్చారు. నిదానపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు.

ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి సదస్సులు దోహదపడతాయని తెలిపారు. గ్రామాల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, తాగునీటి సంరక్షణ వంటి అంశాల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో ఎ. రాములు గ్రామాల్లో పరిశుభ్రత, ప్లాస్టిక్ నిర్మూలన, తాగునీటి సదుపాయాలపై అవగాహన కల్పించారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సీజన్‌కు అనుగుణంగా పంటల సాగుపై సూచనలు అందించారు. ఆర్‌ఐ శోభ జనాభా గణన ప్రాధాన్యాన్ని వివరించగా, పోలీసు శాఖ అధికారులు రోడ్డు భద్రత, మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. హౌసింగ్ శాఖ అధికారులు గృహ నిర్మాణాల పురోగతిని వివరించారు.

కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి ఎం.డి. రావూఫ్ అలీ, మండల వ్యవసాయ అధికారి ఎం.డి. అజాజ్ అలీ ఖాన్, విద్యుత్ శాఖ ఏఈ కోటేశ్వరరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ రాఘవ, హౌసింగ్ ఏఈ సురేష్, ఈజీఎస్ ఏపీఓ పి. వెంకన్న, పంచాయతీ కార్యదర్శి సుమన్, ఉప సర్పంచ్ కొండ అండాలు మల్లయ్య,జీపీఓ లక్ష్మి, ఈజీఎస్ ఎఫ్‌ఏ చంద్రయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ భాగ్యమ్మ, అంగన్‌వాడీ టీచర్లు నాగమ్మ, హారిక, వైద్య సిబ్బంది ఆదిలక్ష్మి, గంగపురం మాధవి, గ్రామ పంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News