చంద్రారెడ్డికి ఎమ్మెల్యే వీరేశం నివాళి
చంద్రారెడ్డికి ఎమ్మెల్యే వీరేశం నివాళి
Editor Desk
రామన్నపేట మండలంలోని సిరిపురం గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన సూదిని చంద్రారెడ్డి మృతదేహానికి ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శనివారం పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
చంద్రారెడ్డి మరణం బాధాకరమని పేర్కొన్న ఎమ్మెల్యే, వారి కుటుంబానికి ధైర్యం చెప్పి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వలిగొండ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు గంగుల రాజిరెడ్డి, జినుకుల ప్రభాకర్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిరిగిరెడ్డి నర్సిరెడ్డి, అడ్వకేట్ సుక్క శ్రవణ్ కుమార్, శ్రీ పార్వతీ పరమేశ్వర దేవస్థానం చైర్మన్ రాపోలు రమేష్, పున్న అమరేందర్, దాస్రెడ్డి వెంకటరమణ, కట్ట గోపాల్రెడ్డి, కంకల మల్లేష్, గాదె యాదయ్య, ఐటిపాముల రంగయ్య తదితరులు పాల్గొన్నారు..
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి