Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు.. ఉద్రిక్తతకు దారి తీసిన అర్ధరాత్రి ఘటన ధర్మవరం వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ బదిలీ రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 06, 2026 03:16 PM

ప్రజల సమస్యలే మా ప్రాధాన్యం.. వార్డు సమగ్ర అభివృద్ధే లక్ష్యం” – కౌన్సిలర్ షారుక్ ఖాన్

ప్రజల సమస్యలే మా ప్రాధాన్యం.. వార్డు సమగ్ర అభివృద్ధే లక్ష్యం” – కౌన్సిలర్ షారుక్ ఖాన్

ప్రజల సమస్యలే మా ప్రాధాన్యం.. వార్డు సమగ్ర అభివృద్ధే లక్ష్యం” – కౌన్సిలర్ షారుక్ ఖాన్
June 06, 2026 01:44 PM 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో శనివారం కౌన్సిలర్ షారుక్ ఖాన్ ఆధ్వర్యంలో వార్డు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులో నెలకొన్న తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు, రహదారులు, డ్రైనేజీ తదితర సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టడమే వార్డు సభ ముఖ్య ఉద్దేశమని కౌన్సిలర్ షారుక్ ఖాన్ తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి సంబంధిత అధికారుల సహకారంతో సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని, ప్రజల భాగస్వామ్యంతోనే వార్డు అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు సూచించిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ వి. ప్రశాంతి, సీఐ శ్రీనివాస్ రెడ్డి హాజరై ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. అనంతరం కౌన్సిలర్ షారుక్ ఖాన్ ముఖ్య అతిథులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, యువత మరియు మహిళలు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, వార్డు సమగ్ర అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News