ప్రజల సమస్యలే మా ప్రాధాన్యం.. వార్డు సమగ్ర అభివృద్ధే లక్ష్యం” – కౌన్సిలర్ షారుక్ ఖాన్
ప్రజల సమస్యలే మా ప్రాధాన్యం.. వార్డు సమగ్ర అభివృద్ధే లక్ష్యం” – కౌన్సిలర్ షారుక్ ఖాన్
Krishna
నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో శనివారం కౌన్సిలర్ షారుక్ ఖాన్ ఆధ్వర్యంలో వార్డు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులో నెలకొన్న తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు, రహదారులు, డ్రైనేజీ తదితర సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టడమే వార్డు సభ ముఖ్య ఉద్దేశమని కౌన్సిలర్ షారుక్ ఖాన్ తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి సంబంధిత అధికారుల సహకారంతో సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని, ప్రజల భాగస్వామ్యంతోనే వార్డు అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు సూచించిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ వి. ప్రశాంతి, సీఐ శ్రీనివాస్ రెడ్డి హాజరై ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. అనంతరం కౌన్సిలర్ షారుక్ ఖాన్ ముఖ్య అతిథులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, యువత మరియు మహిళలు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, వార్డు సమగ్ర అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ స్పష్టం చేశారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి