ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలి – మాణిక్ రావు పటేల్కు శుభాకాంక్షలు
ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలి – మాణిక్ రావు పటేల్కు శుభాకాంక్షలు
Krishna
నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ స్వగృహంలో నాగల్గిద్దా మండలంలోని ముక్టాపూర్ గ్రామానికి చెందిన నాగల్గిద్దా మండల కాంగ్రెస్ అధ్యక్షులు మాణిక్ రావు పటేల్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి మాణిక్ రావు పటేల్ చేస్తున్న కృషి అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ అభివృద్ధికి సేవలందిస్తున్న ఆయన మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ వివేకానంద మహేందర్, లక్ష్మణ్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శివకుమార్, తొర్నల్ గ్రామ సర్పంచ్ సంగమేష్ పటేల్, జ్ఞానేశ్వర్ పటేల్, జ్ఞాన్ రెడ్డి, ఉపసర్పంచ్ అనిల్ పటేల్, దత్తు రెడ్డి, రాజి రెడ్డి, సంతోష్, కొండల్ రెడ్డి, ఎకనాథ్, రాజు, బక్షిరాం, పరమేష్, నందు తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగాయి.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి