Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మేడికుంద గ్రామసభలో అభివృద్ధి అంశాలపై విస్తృత చర్చ ధర్మవరం వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ బదిలీ రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 06, 2026 03:28 PM

అర్హులకే పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి ఎంపీడీవోకు దళిత మోర్చా మండల అధ్యక్షుడు వినతి

అర్హులకే పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి ఎంపీడీవోకు దళిత మోర్చా మండల అధ్యక్షుడు వినతి

అర్హులకే పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి ఎంపీడీవోకు దళిత మోర్చా మండల అధ్యక్షుడు వినతి
June 06, 2026 02:26 PM 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నిదానపల్లి, అర్హులైన నిరుపేదలకే పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని దళిత మోర్చా మండల అధ్యక్షుడు రాపోలు రమేష్ కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన అవగాహన సదస్సుకు హాజరైన ఎంపీడీవోకు శనివారం ఆయన వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా రాపోలు రమేష్ మాట్లాడుతూ గ్రామంలో అర్హత కలిగిన పేద కుటుంబాలందరికీ ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రయోజనాలు అందేలా చూడాలని కోరారు. అలాగే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర అర్హులైన నిరుపేదలకు మాత్రమే సామాజిక భద్రత పింఛన్లు మంజూరు చేసే విధంగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పాటించి నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. వినతిపత్రాన్ని స్వీకరించిన ఎంపీడీవో సమస్యలను పరిశీలించి నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య ఎంపిఓ రావుఫ్ అలీ, తదితరులు ఉన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News