అర్హులకే పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి ఎంపీడీవోకు దళిత మోర్చా మండల అధ్యక్షుడు వినతి
అర్హులకే పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి ఎంపీడీవోకు దళిత మోర్చా మండల అధ్యక్షుడు వినతి
Editor Desk
నిదానపల్లి, అర్హులైన నిరుపేదలకే పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని దళిత మోర్చా మండల అధ్యక్షుడు రాపోలు రమేష్ కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన అవగాహన సదస్సుకు హాజరైన ఎంపీడీవోకు శనివారం ఆయన వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రాపోలు రమేష్ మాట్లాడుతూ గ్రామంలో అర్హత కలిగిన పేద కుటుంబాలందరికీ ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రయోజనాలు అందేలా చూడాలని కోరారు. అలాగే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర అర్హులైన నిరుపేదలకు మాత్రమే సామాజిక భద్రత పింఛన్లు మంజూరు చేసే విధంగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పాటించి నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. వినతిపత్రాన్ని స్వీకరించిన ఎంపీడీవో సమస్యలను పరిశీలించి నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య ఎంపిఓ రావుఫ్ అలీ, తదితరులు ఉన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి