టీబీ ముక్త్ భారత్ అభియాన్కు సర్పంచ్ విక్రమ్ శ్రీకారం
టీబీ ముక్త్ భారత్ అభియాన్కు సర్పంచ్ విక్రమ్ శ్రీకారం
Editor Desk
రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా 100 రోజుల టీబీ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని శనివారం ఇంద్రపాలనగరంలో గ్రామ సర్పంచ్ గర్దాస్ విక్రమ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా టీబీ అనుమానితులకు ఎక్స్రే పరీక్షలు నిర్వహించారు.
గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సర్పంచ్ కోరారు. టీబీ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే సమర్థవంతమైన చికిత్స అందించి పూర్తిగా నయం చేయవచ్చని వైద్య సిబ్బంది తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నరేందర్, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు సింగణబోయిన జంగయ్య, జిట్టబోయిన వెంకటేష్, గోళ్లేపల్లి యాదయ్య, బొల్ల నర్సింహా, ఎర్రం దాస్, మంటి బిక్షపతి, శివగల్ల ముత్యాలు, పగుడాల రామచంద్రం పాల్గొన్నారు. అలాగే వైద్యాధికారి జి. గోపాల్, హెచ్ఈఓ ఎం. వాణిశ్రీ, సూపర్వైజర్ వి. అరుంధతి, ఏఎన్ఎం జానకమ్మ, ఎస్టీఎస్ అశ్విని, ఆశా కార్యకర్తలు, గ్రామస్థులు హాజరయ్యారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి