వినాయక నగర్ సమస్యలు పరిష్కరించాలి. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కాలనీవాసుల వినతి.
వినాయక నగర్ సమస్యలు పరిష్కరించాలి. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కాలనీవాసుల వినతి.
Editor Desk
హయాత్నగర్ లెక్చరర్స్ కాలనీ డివిజన్ పరిధిలోని శ్రీ వినాయక నగర్ కాలనీలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాలనీవాసులు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని కోరారు. శనివారం బీఆర్ఎస్ నాయకురాలు సింగిరెడ్డి మల్లీశ్వరి రెడ్డి ఆధ్వర్యంలో కాలనీవాసులు ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు.
కాలనీలో అంతర్గత అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు, కాలనీల మధ్య విద్యుత్ లైన్ పోల్స్ ఏర్పాటు, మంచినీటి సరఫరా లైన్లు, సీసీ రోడ్లు తదితర సమస్యలు నెలకొన్నాయని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పందిస్తూ కాలనీలోని సమస్యలను పరిశీలించి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాలనీ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్రీ వినాయక నగర్ కాలనీ అధ్యక్షుడు దొడ్డి లింగం, కాలనీ సభ్యులు కనకారావు, దుర్గాప్రసాద్, రమేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి