Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:49 AM

ఆదోనిలో 56 మందికి రూ.18.04 లక్షల చెక్కుల పంపిణీ

ఆదోనిలో 56 మందికి రూ.18.04 లక్షల చెక్కుల పంపిణీ

ఆదోనిలో 56 మందికి రూ.18.04 లక్షల చెక్కుల పంపిణీ
06-06-2026 73 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని, : అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) కొండంత అండగా నిలుస్తోందని టీడీపీ సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు అన్నారు.

ఆదోని పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన 56 మంది లబ్ధిదారులకు రూ.18,04,242 విలువైన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమం ఆదోని టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉమాపతి నాయుడు మాట్లాడుతూ, సీఎం సహాయనిధి ద్వారా ఎంతోమంది పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తోందన్నారు. అనారోగ్య కారణాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలు ఈ సహాయంతో ఉపశమనం పొందుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న నిధులను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్య, ఆర్థిక సమస్యలను అధిగమించాలని సూచించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని కొనియాడారు. అత్యవసర వైద్య చికిత్సల కోసం అవసరమైన వారికి ముందస్తుగా ఎల్‌వోసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) మంజూరు చేస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.

గత 23 నెలల్లో నియోజకవర్గ పరిధిలో 912 మంది లబ్ధిదారులకు రూ.2.30 కోట్లకు పైగా సీఎం సహాయనిధి అందజేసినట్లు తెలిపారు.

కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Sthanikam

ఆదోనిలో 56 మందికి రూ.18.04 లక్షల చెక్కుల పంపిణీ

Article Image

ఆదోని, : అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) కొండంత అండగా నిలుస్తోందని టీడీపీ సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు అన్నారు.

ఆదోని పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన 56 మంది లబ్ధిదారులకు రూ.18,04,242 విలువైన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమం ఆదోని టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉమాపతి నాయుడు మాట్లాడుతూ, సీఎం సహాయనిధి ద్వారా ఎంతోమంది పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తోందన్నారు. అనారోగ్య కారణాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలు ఈ సహాయంతో ఉపశమనం పొందుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న నిధులను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్య, ఆర్థిక సమస్యలను అధిగమించాలని సూచించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని కొనియాడారు. అత్యవసర వైద్య చికిత్సల కోసం అవసరమైన వారికి ముందస్తుగా ఎల్‌వోసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) మంజూరు చేస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.

గత 23 నెలల్లో నియోజకవర్గ పరిధిలో 912 మంది లబ్ధిదారులకు రూ.2.30 కోట్లకు పైగా సీఎం సహాయనిధి అందజేసినట్లు తెలిపారు.

కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News