Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలి – మాణిక్ రావు పటేల్‌కు శుభాకాంక్షలు ధర్మవరం వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ బదిలీ రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 06, 2026 04:20 PM

ఆదోనిలో 56 మందికి రూ.18.04 లక్షల చెక్కుల పంపిణీ

ఆదోనిలో 56 మందికి రూ.18.04 లక్షల చెక్కుల పంపిణీ

ఆదోనిలో 56 మందికి రూ.18.04 లక్షల చెక్కుల పంపిణీ
June 06, 2026 02:40 PM 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని, : అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) కొండంత అండగా నిలుస్తోందని టీడీపీ సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు అన్నారు.

ఆదోని పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన 56 మంది లబ్ధిదారులకు రూ.18,04,242 విలువైన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమం ఆదోని టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉమాపతి నాయుడు మాట్లాడుతూ, సీఎం సహాయనిధి ద్వారా ఎంతోమంది పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తోందన్నారు. అనారోగ్య కారణాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలు ఈ సహాయంతో ఉపశమనం పొందుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న నిధులను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్య, ఆర్థిక సమస్యలను అధిగమించాలని సూచించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని కొనియాడారు. అత్యవసర వైద్య చికిత్సల కోసం అవసరమైన వారికి ముందస్తుగా ఎల్‌వోసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) మంజూరు చేస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.

గత 23 నెలల్లో నియోజకవర్గ పరిధిలో 912 మంది లబ్ధిదారులకు రూ.2.30 కోట్లకు పైగా సీఎం సహాయనిధి అందజేసినట్లు తెలిపారు.

కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News