ఆదోనిలో 56 మందికి రూ.18.04 లక్షల చెక్కుల పంపిణీ
ఆదోనిలో 56 మందికి రూ.18.04 లక్షల చెక్కుల పంపిణీ
Editor Desk
ఆదోని, : అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) కొండంత అండగా నిలుస్తోందని టీడీపీ సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు అన్నారు.
ఆదోని పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన 56 మంది లబ్ధిదారులకు రూ.18,04,242 విలువైన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమం ఆదోని టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉమాపతి నాయుడు మాట్లాడుతూ, సీఎం సహాయనిధి ద్వారా ఎంతోమంది పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తోందన్నారు. అనారోగ్య కారణాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలు ఈ సహాయంతో ఉపశమనం పొందుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న నిధులను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్య, ఆర్థిక సమస్యలను అధిగమించాలని సూచించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని కొనియాడారు. అత్యవసర వైద్య చికిత్సల కోసం అవసరమైన వారికి ముందస్తుగా ఎల్వోసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) మంజూరు చేస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.
గత 23 నెలల్లో నియోజకవర్గ పరిధిలో 912 మంది లబ్ధిదారులకు రూ.2.30 కోట్లకు పైగా సీఎం సహాయనిధి అందజేసినట్లు తెలిపారు.
కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి