ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో ప్రత్యేక గ్రామసభ
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో ప్రత్యేక గ్రామసభ
Komidala Mahender reddy
వర్షాకాల సన్నద్ధత, హరితహారం, విద్యుత్ సమస్యలపై విస్తృత చర్చ
చిట్యాల మండలం ఆరెగూడెం
గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. గ్రామాభివృద్ధి, వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, ఘన వ్యర్థాల నిర్వహణ, వర్షపు నీటి సంరక్షణ, హరితహారం కార్యక్రమం, విద్యుత్ సమస్యలు తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామస్థులకు వర్షాకాలంలో పారిశుద్ధ్య నిర్వహణపై అవగాహన కల్పించారు. ఘన వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడం ద్వారా గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరాన్ని వివరించారు. అలాగే వర్షపు నీటిని సంరక్షించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో విస్తృతంగా మొక్కలు నాటి వాటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు. విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్యలను కూడా సమావేశంలో ప్రస్తావించి, పరిష్కార చర్యలపై చర్చించారు.
కార్యక్రమంలో ప్రత్యేక అధికారి, ఎంపీవో అనుముల కోటేష్, సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్, ఉపసర్పంచ్ జుంజి రాజు, గ్రామ కార్యదర్శి శారద, వార్డు సభ్యులు రాచమల్ల మహేష్, అనిత, లడే అనిత, నందిపాటి శ్రీను, సప్పిడి విజయలక్ష్మి, గ్రామ జీపీఏ రాణి, విద్యుత్ లైన్మన్ నరసింహ, అంగన్వాడీ ఉపాధ్యాయులు, ఆశా వర్కర్లు, గ్రామ పెద్దలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
సభ అనంతరం ఎంపీవో కోటేష్, సర్పంచ్ శ్యాంసుందర్, గ్రామ కార్యదర్శి శారద హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటిచెప్పారు. గ్రామాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి