Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రజల సమస్యలే మా ప్రాధాన్యం.. వార్డు సమగ్ర అభివృద్ధే లక్ష్యం” – కౌన్సిలర్ షారుక్ ఖాన్ ధర్మవరం వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ బదిలీ రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 06, 2026 02:23 PM

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో ప్రత్యేక గ్రామసభ

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో ప్రత్యేక గ్రామసభ

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో ప్రత్యేక గ్రామసభ
June 06, 2026 12:26 PM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

వర్షాకాల సన్నద్ధత, హరితహారం, విద్యుత్ సమస్యలపై విస్తృత చర్చ

చిట్యాల మండలం ఆరెగూడెం

గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. గ్రామాభివృద్ధి, వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, ఘన వ్యర్థాల నిర్వహణ, వర్షపు నీటి సంరక్షణ, హరితహారం కార్యక్రమం, విద్యుత్ సమస్యలు తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామస్థులకు వర్షాకాలంలో పారిశుద్ధ్య నిర్వహణపై అవగాహన కల్పించారు. ఘన వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడం ద్వారా గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరాన్ని వివరించారు. అలాగే వర్షపు నీటిని సంరక్షించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో విస్తృతంగా మొక్కలు నాటి వాటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు. విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్యలను కూడా సమావేశంలో ప్రస్తావించి, పరిష్కార చర్యలపై చర్చించారు.

కార్యక్రమంలో ప్రత్యేక అధికారి, ఎంపీవో అనుముల కోటేష్, సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్, ఉపసర్పంచ్ జుంజి రాజు, గ్రామ కార్యదర్శి శారద, వార్డు సభ్యులు రాచమల్ల మహేష్, అనిత, లడే అనిత, నందిపాటి శ్రీను, సప్పిడి విజయలక్ష్మి, గ్రామ జీపీఏ రాణి, విద్యుత్ లైన్‌మన్ నరసింహ, అంగన్‌వాడీ ఉపాధ్యాయులు, ఆశా వర్కర్లు, గ్రామ పెద్దలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

సభ అనంతరం ఎంపీవో కోటేష్, సర్పంచ్ శ్యాంసుందర్, గ్రామ కార్యదర్శి శారద హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటిచెప్పారు. గ్రామాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News