తడిసిన ధాన్యం తరుగు లేకుండా కొనుగోలు చేయాలి.. తాటికొండ సీతయ్య
తడిసిన ధాన్యం తరుగు లేకుండా కొనుగోలు చేయాలి.. తాటికొండ సీతయ్య
Bandi Kiran Kumar
అకాల వర్షానికి తడిసిన ధాన్యం ప్రభుత్వమే బాధ్యత వహించి కొనుగోలు చేయాలని. రెండునెలలుగ రైతులు ధాన్యాన్ని తెచ్చి కొనుగోలు కేంద్రాల్లో పోసి నప్పటికీ సేకరణ చేయడంలో నిర్లక్ష్యం చేసినందునే ధాన్యం తడిసిపోయింది. తుంగతుర్తి రైతు సేవాసహాకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేంద్రంలో పరిశీలన చేసిన సందర్భంగా మాట్లాడుతూ తుంగతుర్తి మండలం లోని వెంపటి. గొట్టిపర్తి. రావులపల్లి. గానుగుబండ. కొత్తగూడెం. అన్నారం. సంగెం గ్రామాల్లో ధాన్యం సేకరణ లొ జాప్యం జరగడం వలన నిన్న కురిసిన వర్షానికి పూర్తిగా తడిసి పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర సంహత్సరాలుగా రైతు వ్యతిరేఖ విధానాలు అవలంబిస్తుసక్రమంగా కరెంటు. ఇవ్వకున్న. ఎరువులు అందచేయకున్న. రైతు భరోసా ఇవ్వకున్న రుణ మాఫీ చేయకున్నా. రైతు బీమా రద్దు చేసినప్పటికీ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనుగోలు కేంద్రాల్లో పోస్తే సకాలం లో కాంటాల్ వేయక. లారీలు పంపక. దిగుమతులు త్వరగా చేయకపోవడం వలన కోతలు విధించడం తో రైతాంగం పూర్తిగా నష్ట పోయి అప్పులపాలయ్యారని అన్నారు. అందుకే అబద్ధాల రైతు వ్యతిరేఖ ప్రభుత్వానికి తగిన శాస్తి చేసేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లనాయకులు గుండగానీ రాములు గౌడ్ మండల నాయకులు యాకు నాయక్. భాస్కర్. వీరన్న. వెంకటేష్. నల్లబెల్లి వెంకటేష్. లింగయ్య తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి