Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలి – మాణిక్ రావు పటేల్‌కు శుభాకాంక్షలు ధర్మవరం వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ బదిలీ రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 06, 2026 07:13 PM

ఘాట్‌ రోడ్డు కాదు.. గుప్తనిధుల కోసమే తవ్వుతున్నారా? - మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి

ఘాట్‌ రోడ్డు కాదు.. గుప్తనిధుల కోసమే తవ్వుతున్నారా? - మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి

ఘాట్‌ రోడ్డు కాదు.. గుప్తనిధుల కోసమే తవ్వుతున్నారా?  - మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి
June 06, 2026 05:38 PM 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ: బ్రహ్మంగారి గుట్ట, లతీఫ్‌సాబ్ గుట్టలపై నిర్వహించిన బ్లాస్టింగ్‌ల వల్ల మునుగోడు రోడ్ హౌసింగ్ కాలనీ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బాధిత కుటుంబాలను పరామర్శించిన ఆయన, బ్లాస్టింగ్ సమయంలో పెద్ద రాళ్లు ఇళ్లపై పడి స్లాబ్‌లు, రేకులు దెబ్బతిన్నాయని స్థానికులు తమకు వివరించారని తెలిపారు.


ఘాట్‌ రోడ్డు నిర్మాణం పేరుతో 20 మీటర్ల లోతు వరకు తవ్వకాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని, గుప్తనిధుల కోసమే తవ్వుతున్నారేమోనని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. నివాస ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఓపెన్ బ్లాస్టింగ్‌లు నిర్వహించడం దారుణమని, ఏదైనా ప్రాణనష్టం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని అధికారులను ప్రశ్నించారు.


ఘాట్‌ రోడ్డు నిర్మాణానికి సంబంధించి డీపీఆర్, అంచనాలు, టెండర్ ప్రక్రియ వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. బ్లాస్టింగ్ కారణంగా నష్టపోయిన కుటుంబాలకు పరిహారం చెల్లించి, కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేయాలని కోరారు.


ఈ కార్యక్రమంలో నాయకులు, కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News