ఘాట్ రోడ్డు కాదు.. గుప్తనిధుల కోసమే తవ్వుతున్నారా? - మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి
ఘాట్ రోడ్డు కాదు.. గుప్తనిధుల కోసమే తవ్వుతున్నారా? - మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి
Editor Desk
నల్లగొండ: బ్రహ్మంగారి గుట్ట, లతీఫ్సాబ్ గుట్టలపై నిర్వహించిన బ్లాస్టింగ్ల వల్ల మునుగోడు రోడ్ హౌసింగ్ కాలనీ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం బాధిత కుటుంబాలను పరామర్శించిన ఆయన, బ్లాస్టింగ్ సమయంలో పెద్ద రాళ్లు ఇళ్లపై పడి స్లాబ్లు, రేకులు దెబ్బతిన్నాయని స్థానికులు తమకు వివరించారని తెలిపారు.
ఘాట్ రోడ్డు నిర్మాణం పేరుతో 20 మీటర్ల లోతు వరకు తవ్వకాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని, గుప్తనిధుల కోసమే తవ్వుతున్నారేమోనని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. నివాస ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఓపెన్ బ్లాస్టింగ్లు నిర్వహించడం దారుణమని, ఏదైనా ప్రాణనష్టం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని అధికారులను ప్రశ్నించారు.
ఘాట్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి డీపీఆర్, అంచనాలు, టెండర్ ప్రక్రియ వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. బ్లాస్టింగ్ కారణంగా నష్టపోయిన కుటుంబాలకు పరిహారం చెల్లించి, కాంట్రాక్టర్పై కేసు నమోదు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నాయకులు, కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి