Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:48 AM

చెర్లగౌరారంలో బాల పంచాయతీ

చెర్లగౌరారంలో బాల పంచాయతీ

చెర్లగౌరారంలో బాల పంచాయతీ
06-06-2026 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ: కనగల్ మండలం చెర్లగౌరారం గ్రామంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బాల పంచాయతీ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీజీపీఏ డైరెక్టర్ అభిలాషా బిష్త్, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. పిల్లల్లో నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, సమస్యల పరిష్కార నైపుణ్యాల పెంపుదలే లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాల మౌలిక వసతులు, తాగునీరు, పరిశుభ్రత, బాలల భద్రత తదితర అంశాలపై తమ అభిప్రాయాలు వెల్లడించారు. బాలల హక్కులు, విద్య ప్రాముఖ్యతపై అధికారులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

చెర్లగౌరారంలో బాల పంచాయతీ

Article Image

నల్లగొండ: కనగల్ మండలం చెర్లగౌరారం గ్రామంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బాల పంచాయతీ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీజీపీఏ డైరెక్టర్ అభిలాషా బిష్త్, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. పిల్లల్లో నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, సమస్యల పరిష్కార నైపుణ్యాల పెంపుదలే లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాల మౌలిక వసతులు, తాగునీరు, పరిశుభ్రత, బాలల భద్రత తదితర అంశాలపై తమ అభిప్రాయాలు వెల్లడించారు. బాలల హక్కులు, విద్య ప్రాముఖ్యతపై అధికారులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News