నల్లగొండ: కనగల్ మండలం చెర్లగౌరారం గ్రామంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బాల పంచాయతీ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీజీపీఏ డైరెక్టర్ అభిలాషా బిష్త్, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. పిల్లల్లో నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, సమస్యల పరిష్కార నైపుణ్యాల పెంపుదలే లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాల మౌలిక వసతులు, తాగునీరు, పరిశుభ్రత, బాలల భద్రత తదితర అంశాలపై తమ అభిప్రాయాలు వెల్లడించారు. బాలల హక్కులు, విద్య ప్రాముఖ్యతపై అధికారులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
PRINT TIME: August 26, 2026 04:48 AM
చెర్లగౌరారంలో బాల పంచాయతీ
చెర్లగౌరారంలో బాల పంచాయతీ
06-06-2026
25 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నల్లగొండ: కనగల్ మండలం చెర్లగౌరారం గ్రామంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బాల పంచాయతీ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీజీపీఏ డైరెక్టర్ అభిలాషా బిష్త్, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. పిల్లల్లో నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, సమస్యల పరిష్కార నైపుణ్యాల పెంపుదలే లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాల మౌలిక వసతులు, తాగునీరు, పరిశుభ్రత, బాలల భద్రత తదితర అంశాలపై తమ అభిప్రాయాలు వెల్లడించారు. బాలల హక్కులు, విద్య ప్రాముఖ్యతపై అధికారులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి