ప్రభుత్వ భూములను కాపాడాలి. నీర్నెముల గ్రామస్తుల వినతి
ప్రభుత్వ భూములను కాపాడాలి. నీర్నెముల గ్రామస్తుల వినతి
Editor Desk
రామన్నపేట: గ్రామ కంఠం, చెరువు శిఖం, కుంటల భూములు అక్రమ ఆక్రమణలకు గురవుతున్నాయని, ప్రభుత్వం వెంటనే సర్వే నిర్వహించి వాటిని పరిరక్షించాలని యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నీర్నెముల గ్రామ ప్రజలు కోరారు.
శనివారం నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక గ్రామసభ సందర్భంగా తహసీల్దార్కు గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని గ్రామ కంఠం, చెరువు శిఖం, కుంటల భూములను కొందరు అక్రమంగా ఆక్రమించి సాగు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ భూములపై పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి ఆక్రమణలను తొలగించాలని, భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా వాటిని పరిరక్షించాలని గ్రామస్తులు కోరారు. ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, వార్డు సభ్యులు ముత్యాల కిషన్, చిన్న పాక రమేష్,బోయిని మల్లేష్,నోముల శివ, నోముల సుదర్శన్, నోముల రవి, నోముల నర్సింహా తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి