Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:48 AM

ప్రభుత్వ భూములను కాపాడాలి. నీర్నెముల గ్రామస్తుల వినతి

ప్రభుత్వ భూములను కాపాడాలి. నీర్నెముల గ్రామస్తుల వినతి

ప్రభుత్వ భూములను కాపాడాలి. నీర్నెముల గ్రామస్తుల వినతి
06-06-2026 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: గ్రామ కంఠం, చెరువు శిఖం, కుంటల భూములు అక్రమ ఆక్రమణలకు గురవుతున్నాయని, ప్రభుత్వం వెంటనే సర్వే నిర్వహించి వాటిని పరిరక్షించాలని యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నీర్నెముల గ్రామ ప్రజలు కోరారు.

శనివారం నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక గ్రామసభ సందర్భంగా తహసీల్దార్‌కు గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని గ్రామ కంఠం, చెరువు శిఖం, కుంటల భూములను కొందరు అక్రమంగా ఆక్రమించి సాగు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ భూములపై పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి ఆక్రమణలను తొలగించాలని, భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా వాటిని పరిరక్షించాలని గ్రామస్తులు కోరారు. ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, వార్డు సభ్యులు ముత్యాల కిషన్, చిన్న పాక రమేష్,బోయిని మల్లేష్,నోముల శివ, నోముల సుదర్శన్, నోముల రవి, నోముల నర్సింహా తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ప్రభుత్వ భూములను కాపాడాలి. నీర్నెముల గ్రామస్తుల వినతి

Article Image

రామన్నపేట: గ్రామ కంఠం, చెరువు శిఖం, కుంటల భూములు అక్రమ ఆక్రమణలకు గురవుతున్నాయని, ప్రభుత్వం వెంటనే సర్వే నిర్వహించి వాటిని పరిరక్షించాలని యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నీర్నెముల గ్రామ ప్రజలు కోరారు.

శనివారం నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక గ్రామసభ సందర్భంగా తహసీల్దార్‌కు గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని గ్రామ కంఠం, చెరువు శిఖం, కుంటల భూములను కొందరు అక్రమంగా ఆక్రమించి సాగు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ భూములపై పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి ఆక్రమణలను తొలగించాలని, భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా వాటిని పరిరక్షించాలని గ్రామస్తులు కోరారు. ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, వార్డు సభ్యులు ముత్యాల కిషన్, చిన్న పాక రమేష్,బోయిని మల్లేష్,నోముల శివ, నోముల సుదర్శన్, నోముల రవి, నోముల నర్సింహా తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News