FPOల బలోపేతానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి
FPOల బలోపేతానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి
Anjali
శనివారం కలెక్టరేట్ లోని పీజీఎస్ హాలు నందు రైతు ఉత్పత్తిదారుల సంస్థలను (FPOs) ఆర్థికంగా బలోపేతం చేసి, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఎఫ్పీఓ జిల్లా మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఎఫ్పీఓల ప్రస్తుత పరిస్థితి, వ్యాపార విస్తరణ, రైతులకు అందుతున్న సేవలపై సమీక్షించారు. వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యక్రమాలతో ఎఫ్పీఓలను అనుసంధానం చేయడం ద్వారా రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చాలని సూచించారు. ఎఫ్పీఓల ద్వారా నాణ్యమైన ఇన్పుట్లు, మార్కెటింగ్ సదుపాయాలు, ప్రభుత్వ పథకాలను రైతులకు సమర్థవంతంగా అందించేందుకు కార్యాచరణ రూపొందించాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి (DAO) నారాయణ నాయక్, నాబార్డ్ డీడీఎం, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (LDM), పీడీ-డీఆర్డీఏ, ఏపీకాబ్ ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు మరియు వివిధ ఎఫ్పీఓల సీఈఓలు, రెడ్స్ స్వచ్చంద సంస్థ డైరెక్ట్ భానుజ, తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి