రైతులను నట్టేట ముంచుతున్న ప్రభుత్వాలు - సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ
రైతులను నట్టేట ముంచుతున్న ప్రభుత్వాలు - సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ
Editor Desk
నకిరేకల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపై ఆర్థిక భారం మోపుతూ వ్యవసాయానికి దూరం చేసే విధానాలను అమలు చేస్తున్నాయని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు ఎం.డేవిడ్ కుమార్ విమర్శించారు. నకిరేకల్లోని యానాల మల్లారెడ్డి స్మారక భవన్లో నిర్వహించిన జిల్లా ప్రజా సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎరువుల ధరల పెంపు, ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, విద్యుత్ రంగ ప్రైవేటీకరణ చర్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్రంలో ట్రాన్స్ఫార్మర్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి భవిష్యత్తులో రైతులపై విద్యుత్ బిల్లుల భారం మోపే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రైతుల ఉచిత విద్యుత్కు ముప్పు పొంచి ఉందని, రైతులంతా ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
సమావేశానికి జిల్లా కార్యదర్శి సాగర్ అధ్యక్షత వహించగా, ఏఐకేఎంఎస్, పీఓడబ్ల్యూతో పాటు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి