Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
FPOల బలోపేతానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ :- సిపిఐ రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 06, 2026 11:07 PM

రైతులను నట్టేట ముంచుతున్న ప్రభుత్వాలు - సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ

రైతులను నట్టేట ముంచుతున్న ప్రభుత్వాలు - సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ

రైతులను నట్టేట ముంచుతున్న ప్రభుత్వాలు - సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ
June 06, 2026 09:39 PM 5 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపై ఆర్థిక భారం మోపుతూ వ్యవసాయానికి దూరం చేసే విధానాలను అమలు చేస్తున్నాయని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు ఎం.డేవిడ్ కుమార్ విమర్శించారు. నకిరేకల్‌లోని యానాల మల్లారెడ్డి స్మారక భవన్‌లో నిర్వహించిన జిల్లా ప్రజా సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎరువుల ధరల పెంపు, ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, విద్యుత్ రంగ ప్రైవేటీకరణ చర్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్రంలో ట్రాన్స్‌ఫార్మర్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి భవిష్యత్తులో రైతులపై విద్యుత్ బిల్లుల భారం మోపే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రైతుల ఉచిత విద్యుత్‌కు ముప్పు పొంచి ఉందని, రైతులంతా ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

సమావేశానికి జిల్లా కార్యదర్శి సాగర్ అధ్యక్షత వహించగా, ఏఐకేఎంఎస్, పీఓడబ్ల్యూతో పాటు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News