కలిసికట్టుగా పనిచేస్తేనే వార్డుల అభివృద్ధి
కలిసికట్టుగా పనిచేస్తేనే వార్డుల అభివృద్ధి
K.RAVI
* చౌటుప్పల్ 9వ వార్డు సభలో మున్సిపల్ చైర్పర్సన్ పావని రమేష్ గౌడ్
* అన్యోన్య దాంపత్యానికి ‘సీడీఈడబ్ల్యూ’ కౌన్సెలింగ్ బాటలు
ప్రజలందరూ కలిసికట్టుగా భాగస్వామ్యులై పనిచేసినప్పుడే వార్డుల అభివృద్ధి సాధ్యమవుతుందని చౌటుప్పల్ మున్సిపల్ చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అన్నారు. ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా శనివారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో ప్రత్యేక వార్డు సభను నిర్వహించారు. ఈ సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ..ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సభలు జూన్ 10వ తేదీ వరకు నిరంతరాయంగా కొనసాగుతాయని చైర్పర్సన్ వివరించారు. వార్డుల్లోని సమస్యల పరిష్కారానికి, ప్రగతి సాధనకు ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని కోరారు. మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నడుస్తున్న 'మహిళా అభివృద్ధి, సాధికారిక కేంద్రాలు' అద్భుతమైన సేవలు అందిస్తున్నాయని కొనియాడారు. ఈ కేంద్రాల ద్వారా అందిస్తున్న కౌన్సెలింగ్ ఎన్నో కుటుంబాలలో విభేదాలను తొలగించి, అన్యోన్య దాంపత్యానికి బాటలు వేస్తోందని ఆమె హర్షం వ్యక్తం చేశారు.ఈ సభలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్, స్థానిక షీ టీమ్ అధికారులు, వార్డు ప్రతినిధులు, స్థానిక ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి