Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం: ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ :- సిపిఐ రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 06, 2026 09:19 PM

చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తాం

చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తాం

చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తాం
June 06, 2026 07:37 PM 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ధర్మోజీగూడెం ఐకేపీ కేంద్రాన్ని పరిశీలించిన ఏఎంసీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, సర్పంచ్ జువ్వి నర్సింహ్మ

ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరుగుతున్నాయని.. చివరి గింజ వరకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, ధర్మోజీగూడెం సర్పంచ్ జువ్వి నర్సింహ్మలు అన్నారు. చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం వారు సందర్శించారు. ధాన్యం కొనుగోళ్ళను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ధాన్యం పూర్తిగా కొనుగోలు చేస్తుందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వేగంగా కొనుగోలు సాగుతున్నాయన్నారు. త్వరలోనే పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు పూర్తవుతాయన్నారు. ధాన్యం నిల్వలకు వీలుగా ధర్మోజిగూడెం పరిధిలోనే ఒక గోదామును ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ చెన్నగోని అంజయ్య గౌడ్, మండల అధ్యక్షుడు బోయ దేవేందర్, వీరమళ్ళ సత్తయ్య గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీహరి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాచకొండ భార్గవ్, గ్రామ ఉప సర్పంచ్ పక్కీరు శ్రీనివాస్ రెడ్డి, గ్రామ వార్డు సభ్యులు ఊదరి శ్రీనివాస్, ఐతరాజు శారద లింగస్వామి, జీడిమడ్ల శోభ కొండల్, గునుగంటి వెంకటేశం గౌడ్, మాజీ ఉపసర్పంచ్ కొంతం బుచ్చి రెడ్డి, ఊదరి లింగయ్య, ఊదరి పెంటయ్య, కొంతం కృష్ణారెడ్డి, పగిళ్ళ లింగారెడ్డి, ఏనుగు ఇస్తారీ రెడ్డి, ఏనుగు లింగారెడ్డి, ఊదరి ఎల్లయ్య, జక్కలి యాదయ్య, జక్కలి మల్లయ్య, చేన్నోజు విజయ చారి, ఊదరి స్వామి, డాకోజీ సతీష్, ఊదరి కృష్ణమూర్తి, గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News