బాలబాలికల అభివృద్ధికి చేయూత – సంగారెడ్డిలో సైకిళ్ల పంపిణీ
బాలబాలికల అభివృద్ధికి చేయూత – సంగారెడ్డిలో సైకిళ్ల పంపిణీ
Krishna
సంగారెడ్డిలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో చిన్నారులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటికే సుమారు 400 మంది చిన్నారులకు సైకిళ్లు అందజేసిన ఆయన, శనివారం స్థానిక పీఎస్ఆర్ గార్డెన్లో నిర్వహించిన కార్యక్రమంలో మరో 210 మంది బాలబాలికలకు సైకిళ్లు పంపిణీ చేశారు. చిన్నారుల్లో చదువుపై ఆసక్తి పెంపొందించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం, ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని జగ్గారెడ్డి తెలిపారు. ఐదు నుంచి 15 సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు ప్రత్యేకంగా సైకిళ్లు అందజేయగా, ప్రతి చిన్నారికి స్వయంగా సైకిల్ అందించి అభినందించారు.గత వారం టోకెన్లు పొందిన వారికి ఈ విడతలో సైకిళ్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్న జగ్గారెడ్డి, ఇంకా సైకిళ్లు అందని చిన్నారులు ఎవరూ ఆందోళన చెందవద్దని, పేర్లు నమోదు చేసుకున్న వారందరికీ దశలవారీగా సైకిళ్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. టోకెన్లు లేని చిన్నారుల ఆధార్ వివరాలు, తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు సేకరించి తదుపరి విడతలో వారికి కూడా సైకిళ్లు పంపిణీ చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జార్జ్, టౌన్ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, నాయకులు కూన సంతోష్, మహేష్, సుదీప్ తదితరులు పాల్గొన్నారు. చిన్నారుల సంక్షేమం కోసం చేపట్టిన ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి