Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:52 PM

బాలబాలికల అభివృద్ధికి చేయూత – సంగారెడ్డిలో సైకిళ్ల పంపిణీ

బాలబాలికల అభివృద్ధికి చేయూత – సంగారెడ్డిలో సైకిళ్ల పంపిణీ

బాలబాలికల అభివృద్ధికి చేయూత – సంగారెడ్డిలో సైకిళ్ల పంపిణీ
06-06-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డిలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో చిన్నారులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటికే సుమారు 400 మంది చిన్నారులకు సైకిళ్లు అందజేసిన ఆయన, శనివారం స్థానిక పీఎస్ఆర్ గార్డెన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మరో 210 మంది బాలబాలికలకు సైకిళ్లు పంపిణీ చేశారు. చిన్నారుల్లో చదువుపై ఆసక్తి పెంపొందించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం, ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని జగ్గారెడ్డి తెలిపారు. ఐదు నుంచి 15 సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు ప్రత్యేకంగా సైకిళ్లు అందజేయగా, ప్రతి చిన్నారికి స్వయంగా సైకిల్ అందించి అభినందించారు.గత వారం టోకెన్లు పొందిన వారికి ఈ విడతలో సైకిళ్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్న జగ్గారెడ్డి, ఇంకా సైకిళ్లు అందని చిన్నారులు ఎవరూ ఆందోళన చెందవద్దని, పేర్లు నమోదు చేసుకున్న వారందరికీ దశలవారీగా సైకిళ్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. టోకెన్లు లేని చిన్నారుల ఆధార్ వివరాలు, తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు సేకరించి తదుపరి విడతలో వారికి కూడా సైకిళ్లు పంపిణీ చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జార్జ్, టౌన్ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, నాయకులు కూన సంతోష్, మహేష్, సుదీప్ తదితరులు పాల్గొన్నారు. చిన్నారుల సంక్షేమం కోసం చేపట్టిన ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Sthanikam

బాలబాలికల అభివృద్ధికి చేయూత – సంగారెడ్డిలో సైకిళ్ల పంపిణీ

Article Image

సంగారెడ్డిలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో చిన్నారులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటికే సుమారు 400 మంది చిన్నారులకు సైకిళ్లు అందజేసిన ఆయన, శనివారం స్థానిక పీఎస్ఆర్ గార్డెన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మరో 210 మంది బాలబాలికలకు సైకిళ్లు పంపిణీ చేశారు. చిన్నారుల్లో చదువుపై ఆసక్తి పెంపొందించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం, ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని జగ్గారెడ్డి తెలిపారు. ఐదు నుంచి 15 సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు ప్రత్యేకంగా సైకిళ్లు అందజేయగా, ప్రతి చిన్నారికి స్వయంగా సైకిల్ అందించి అభినందించారు.గత వారం టోకెన్లు పొందిన వారికి ఈ విడతలో సైకిళ్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్న జగ్గారెడ్డి, ఇంకా సైకిళ్లు అందని చిన్నారులు ఎవరూ ఆందోళన చెందవద్దని, పేర్లు నమోదు చేసుకున్న వారందరికీ దశలవారీగా సైకిళ్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. టోకెన్లు లేని చిన్నారుల ఆధార్ వివరాలు, తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు సేకరించి తదుపరి విడతలో వారికి కూడా సైకిళ్లు పంపిణీ చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జార్జ్, టౌన్ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, నాయకులు కూన సంతోష్, మహేష్, సుదీప్ తదితరులు పాల్గొన్నారు. చిన్నారుల సంక్షేమం కోసం చేపట్టిన ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News