భవన నిర్మాణ కార్మికుల నిరవధిక సమ్మె
భవన నిర్మాణ కార్మికుల నిరవధిక సమ్మె
K.RAVI
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చౌటుప్పల్, నారాయణపూర్ మండలాల భవన నిర్మాణ కార్మికులు శనివారం చౌటుప్పల్ చిన్న కొండూరు రోడ్డు చౌరస్తా వద్ద నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు ఎండీ. పాషా, గుండెపోని రాములు మాట్లాడుతూ.. 55 ఏళ్లు నిండిన కార్మికులకు రూ.5 వేల పెన్షన్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు. అలాగే ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.20 లక్షలు, సహజ మరణానికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, కుమార్తె పెళ్లికి రూ.లక్ష, ప్రసూతి సాయం రూ.60 వేలు అందించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ బోర్డు ప్రైవేటీకరణను ఆపాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఎండీ. పాషా, గుండెపోని రాములు, బొల్లా మౌని రాములు, నరసింహ, సుక్క యాదయ్య, ఎర్నం శ్రీనివాస్, నెలికంటి నరసింహ, కలకుంట్ల శివకుమార్, వెంకటయ్య, సీమకండ్ల శ్రీరాములు, మడారి మార్క్, సదానందం, నరసింహ, శ్రీను, జువ్వి యాదయ్య, లింగస్వామి, రేఖ మల్లయ్య, ఉబ్బు యాదయ్య, జాజుల బిక్షపతి, గజ్జల రాజు, ఊదరి రామచంద్రం, బందేలా ఈశ్వర్, బాతరాజు లక్ష్మయ్య, గోరిగే సోములు, ఆదిమూలం నందీశ్వర్, కొంగరి మారయ్య, జంగయ్య, పులమోని శంకర్, దుర్గం గాలయ్య, సిరిపంగి దశరథ తదితర కార్మికులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి