Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 01:16 AM

పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం.

పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం.

పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం.
03-05-2026 137 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జబల్‌పూర్,

: తల్లి ప్రేమకు మరణం కూడా అడ్డుకాదని మరోసారి నిరూపించిన విషాద ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. బర్గి డ్యాం వద్ద జరిగిన పడవ ప్రమాదంలో బిడ్డను హత్తుకుని మృతి చెందిన తల్లి దృశ్యం దేశవ్యాప్తంగా కంటతడి పెట్టిస్తోంది.

విహారయాత్రకు వెళ్లిన పర్యాటకులు ప్రయాణిస్తున్న క్రూయిజ్ పడవ ప్రమాదవశాత్తు మునిగిపోవడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఓ తల్లి తన బిడ్డను కాపాడుకునే ప్రయత్నంలో చివరి వరకు హత్తుకుని ప్రాణాలు విడిచింది.

ప్రమాదం జరిగిన గంటల తర్వాత బయటపడిన తల్లి–బిడ్డ మృతదేహాలు అందరినీ కలిచివేశాయి. లైఫ్ జాకెట్ ధరించినప్పటికీ బిడ్డను వదలకుండా చివరి వరకు తన ఒడిలోనే ఉంచుకోవడం తల్లితనానికి నిదర్శనంగా నిలిచింది.

ప్రాణాపాయం తెలిసినా బిడ్డను విడిచిపెట్టలేకపోయిన ఆ తల్లి త్యాగం ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటన తల్లి ప్రేమ గొప్పతనాన్ని మరోసారి చాటి చెబుతోంది.

మృత్యువుతో ఓడినా… తల్లిగా గెలిచింది

బిడ్డను కాపాడాలనే తపనతో చివరి క్షణం వరకు పోరాడిన ఆ తల్లి, మృత్యువుతో ఓడినా తల్లిగా గెలిచిందనే భావన ప్రతి హృదయాన్ని తాకుతోంది. పేగుబంధం ఎంత గొప్పదో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.

Sthanikam

పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం.

Article Image

జబల్‌పూర్,

: తల్లి ప్రేమకు మరణం కూడా అడ్డుకాదని మరోసారి నిరూపించిన విషాద ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. బర్గి డ్యాం వద్ద జరిగిన పడవ ప్రమాదంలో బిడ్డను హత్తుకుని మృతి చెందిన తల్లి దృశ్యం దేశవ్యాప్తంగా కంటతడి పెట్టిస్తోంది.

విహారయాత్రకు వెళ్లిన పర్యాటకులు ప్రయాణిస్తున్న క్రూయిజ్ పడవ ప్రమాదవశాత్తు మునిగిపోవడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఓ తల్లి తన బిడ్డను కాపాడుకునే ప్రయత్నంలో చివరి వరకు హత్తుకుని ప్రాణాలు విడిచింది.

ప్రమాదం జరిగిన గంటల తర్వాత బయటపడిన తల్లి–బిడ్డ మృతదేహాలు అందరినీ కలిచివేశాయి. లైఫ్ జాకెట్ ధరించినప్పటికీ బిడ్డను వదలకుండా చివరి వరకు తన ఒడిలోనే ఉంచుకోవడం తల్లితనానికి నిదర్శనంగా నిలిచింది.

ప్రాణాపాయం తెలిసినా బిడ్డను విడిచిపెట్టలేకపోయిన ఆ తల్లి త్యాగం ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటన తల్లి ప్రేమ గొప్పతనాన్ని మరోసారి చాటి చెబుతోంది.

మృత్యువుతో ఓడినా… తల్లిగా గెలిచింది

బిడ్డను కాపాడాలనే తపనతో చివరి క్షణం వరకు పోరాడిన ఆ తల్లి, మృత్యువుతో ఓడినా తల్లిగా గెలిచిందనే భావన ప్రతి హృదయాన్ని తాకుతోంది. పేగుబంధం ఎంత గొప్పదో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News