పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్పూర్ విషాదం.
పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్పూర్ విషాదం.
Editor Desk
జబల్పూర్,
: తల్లి ప్రేమకు మరణం కూడా అడ్డుకాదని మరోసారి నిరూపించిన విషాద ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. బర్గి డ్యాం వద్ద జరిగిన పడవ ప్రమాదంలో బిడ్డను హత్తుకుని మృతి చెందిన తల్లి దృశ్యం దేశవ్యాప్తంగా కంటతడి పెట్టిస్తోంది.
విహారయాత్రకు వెళ్లిన పర్యాటకులు ప్రయాణిస్తున్న క్రూయిజ్ పడవ ప్రమాదవశాత్తు మునిగిపోవడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఓ తల్లి తన బిడ్డను కాపాడుకునే ప్రయత్నంలో చివరి వరకు హత్తుకుని ప్రాణాలు విడిచింది.
ప్రమాదం జరిగిన గంటల తర్వాత బయటపడిన తల్లి–బిడ్డ మృతదేహాలు అందరినీ కలిచివేశాయి. లైఫ్ జాకెట్ ధరించినప్పటికీ బిడ్డను వదలకుండా చివరి వరకు తన ఒడిలోనే ఉంచుకోవడం తల్లితనానికి నిదర్శనంగా నిలిచింది.
ప్రాణాపాయం తెలిసినా బిడ్డను విడిచిపెట్టలేకపోయిన ఆ తల్లి త్యాగం ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటన తల్లి ప్రేమ గొప్పతనాన్ని మరోసారి చాటి చెబుతోంది.
మృత్యువుతో ఓడినా… తల్లిగా గెలిచింది
బిడ్డను కాపాడాలనే తపనతో చివరి క్షణం వరకు పోరాడిన ఆ తల్లి, మృత్యువుతో ఓడినా తల్లిగా గెలిచిందనే భావన ప్రతి హృదయాన్ని తాకుతోంది. పేగుబంధం ఎంత గొప్పదో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి