ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డికి ఎస్ఎఫ్ఐ వినతి
మోడల్ స్కూల్ నుంచి హైవే వరకు సీసీ రోడ్డు నిర్మించాలి
రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రూ.10,814 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ చౌటుప్పల్ మండల కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యార్థుల పలు సమస్యలపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి తిగుళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ... ఫీజు బకాయిలు రాకపోవడంతో కొన్ని స్వచ్ఛంద కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల సర్టిఫికెట్లను ఆపివేస్తూ వేధిస్తున్నాయని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమస్యను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలని ఎమ్మెల్యేను కోరారు.అదేవిధంగా చౌటుప్పల్ మోడల్ స్కూల్ నుంచి ప్రధాన హైవే వరకు ఉన్న మట్టి రోడ్డు వల్ల వర్షాకాలంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే అక్కడ సీసీ రోడ్డు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుర్వి అరవింద్, సాత్విక్, శ్రీశాంత్, అజయ్, శివమణి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి