పాతబస్తీలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవాలు
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 28వ డివిజన్ పాతబస్తీలో యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగ ఉత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. వేడుకల్లో నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి పాల్గొని బోనం ఎత్తుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తుందని మేయర్ పేర్కొన్నారు. ప్రజలు భక్తిశ్రద్ధలతో పండుగను నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు.
కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుమ్ముల మోహన్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్ యాదవ్, స్థానిక కార్పొరేటర్ గుండెబోయిన పుష్పలత వెంకన్న, ఆర్టీఏ సభ్యుడు కూసుకుంట్ల రాజిరెడ్డి, పలువురు కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి