కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అధికారం రావడం కోసం చేవెళ్ల లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు కార్గే తో దళిత డిక్లరేషన్ విడుదల చేసి అధికారం వచ్చి మూడేండ్ల అయిన అందులో చెప్పిన అంబేద్కర్ అభయహస్తం పేరుతో చెప్పిన పన్నెండు లక్షల ఆర్ధికసాయం కాని విదేశాల్లో చదువుకున్న దళిత విద్యార్థులకు 20లక్షల ఓవర్సీస్ స్కాలర్ షిప్పు లాంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడ అమలు చేయలేదనీ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాడికొండ సీతయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు.
Sc కార్పొరేషన్ ద్వారా కొట్లాది రూపాయలు నిధులు విడుదల చేసి ప్రతి కుటుంబాన్ని ఆర్ధికంగా ఆడుకుంటామని చెప్పి మూడేండ్ల అయిన ఒక్కరూపాయి కూడ కార్పొరేషన్ ద్వారా దళిత కుటుంబాలకు అందించలేదని అన్నారు. రాష్ట్రం లో అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయకుండా ప్రజాపాలన పేరుతోదగా పాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభత్వ్తానికి పార్టీకి భవిష్యత్ లో తగిన గుణ పాఠం చెప్పాలని. Kcr నాయకత్వాన్ని బలపర్చాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లానాయకులు గుండగాని రాములుగౌడ్ మండల నాయకులు గోపగాని రమేష్ పూర్ణ నాయక్. వీరోజీ నాయక్. సుధాకర్ నాయక్. దళిత నాయకులు సర్పంచ్ తప్పేట్ల ఎల్లయ్య. మాతంగి కరుణాకర్ ఆకారపు భాస్కర్ కదారిదాసు పోలెపాక సోమయ్య బల్లెం ప్రవీణ్. చింతకుంట్ల భాస్కర్గోపగాని శ్రీనివాస్ మల్లేపకారాములు గడ్డం సోమేశ్. మల్లేపక కరుణాకర్. దుబ్బాక విజయ్. బొల్లెద్దు శ్రవణ్. పుల్లూరి పరుశురాం. బొంకూరి శ్యామ్ పోలేపాక రాజేష్ బొంకూరి సాయి.పోలేపాక పరమేష్ కొండగడుపుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి