తిరుమలగిరి;
వర్షా బావ పరిస్థితుల దృష్ట్యా రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని తాసిల్దార్ వినోద్ కుమార్, మున్సిపాలిటీ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి, అన్నారు. బుధవారంమండల మున్సిపాలిటీ పరిధిలోని నందపురం గ్రామంలో నిర్వహించిన రైతులతో మాట పంట మార్పిడికి బాట అనే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులంతా వరి పంటకు బదులు ప్రత్యామ్నాయ పంటలైన కంది,పెసర, మినుములు,వేరుశనగ,జొన్న, ఉద్యానసాగు చేయాలని రైతులను కోరారు. వర్షాలు లేని కారణంగా ఇలాంటి తక్కువ నీరు అవసరమున్న పంటలను పండించినట్లయితే రైతులకు నష్టం వాటిల్లే అవకాశం ఉండదని,నీరు లేని ఈ సమయంలో వరి పంట వేసి రైతులు నష్టపోవద్దని సూచించారు.ఈ కార్యక్రమంలో జి పి ఓ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ కన్నబోయిన మల్లయ్య, మండల రైతు కోఆర్డినేటర్ సంకేపల్లి నరోత్తం రెడ్డి, కందుకూరి బాబు ,నాని కొమ్మిడి కిషోర్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి