హైదరాబాద్: వీరనారి చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్గా బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ జి.మల్లేశంను విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం ప్రతినిధులు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్.అశోక్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ మల్లేశంను శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా విశ్వవిద్యాలయాల్లో దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పీడబ్ల్యూడీ యాక్ట్–2016ను పకడ్బందీగా అమలు చేయాలని కోరుతూ రిజిస్ట్రార్కు వినతిపత్రం అందజేశారు. అలాగే చట్టంపై విశ్వవిద్యాలయంలో ప్రత్యేక సెమినార్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై రిజిస్ట్రార్ సానుకూలంగా స్పందించి సెమినార్కు సమయం కేటాయించడంతో పాటు దివ్యాంగుల హక్కుల చట్టాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో దివ్యాంగుల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మారవేణి చంద్రశేఖర్ యాదవ్, విశ్వవిద్యాలయాల దివ్యాంగుల మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు దొరపల్లి దానమ్మ, విశ్వవిద్యాలయాల రాష్ట్ర సభ్యుడు గుండె శంకర్ తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి