సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో చేయూత పెన్షన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. బుధవారం చనిగేపల్లి గ్రామంలో అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. మండల పరిధిలో ఆగస్టు 12 నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని మండల పరిషత్ అభివృద్ధి అధికారి షాగుప్తా ఇర్ఫాత్ తెలిపారు. వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, డయాలిసిస్, ఫైలేరియా బాధితులు అర్హత ఉంటే పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తులను సంబంధిత మండల పరిషత్ లేదా గ్రామపంచాయతీ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. గ్రామస్థాయిలోనే దరఖాస్తుల స్వీకరణ చేపట్టడంతో లబ్ధిదారులకు సౌకర్యం కలిగింది. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుధాకర్, గౌస్, నాయుమ్ పటేల్, సోమప్ప, మమ్మద్ పటేల్, నర్సింహారెడ్డి, బాసప్ప, పీరమ్మ తదితరులు పాల్గొన్నారు.
గ్రామస్థాయిలోనే చేయూత పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ
గ్రామస్థాయిలోనే చేయూత పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ
Krishna
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో చేయూత పెన్షన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. బుధవారం చనిగేపల్లి గ్రామంలో అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. మండల పరిధిలో ఆగస్టు 12 నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని మండల పరిషత్ అభివృద్ధి అధికారి షాగుప్తా ఇర్ఫాత్ తెలిపారు. వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, డయాలిసిస్, ఫైలేరియా బాధితులు అర్హత ఉంటే పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తులను సంబంధిత మండల పరిషత్ లేదా గ్రామపంచాయతీ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. గ్రామస్థాయిలోనే దరఖాస్తుల స్వీకరణ చేపట్టడంతో లబ్ధిదారులకు సౌకర్యం కలిగింది. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుధాకర్, గౌస్, నాయుమ్ పటేల్, సోమప్ప, మమ్మద్ పటేల్, నర్సింహారెడ్డి, బాసప్ప, పీరమ్మ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి