ఘనంగా ‘ఆస్పైర్ సమ్మిట్ 3.0’ ప్రదానోత్సవం
శిల్పకళా వేదికలో అవార్డు అందజేసిన డైరెక్టర్ రమాదేవి
విద్యాబోధనలో విశిష్ట సేవలు అందిస్తున్న చౌటుప్పల్ నారాయణ హైస్కూల్ బ్రాంచ్ ప్రతిష్ఠాత్మక ‘బెస్ట్ ఎడ్యుకేషన్’ అవార్డును కైవసం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నారాయణ పాఠశాలల విభాగంలో ప్రతిఏటా నిర్వహించే ‘ఆస్పైర్ సమ్మిట్ 3.0’ పురస్కారాల కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఈ వేడుకను కన్నుల పండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ రమాదేవి ముఖ్య అతిథిగా హాజరై చౌటుప్పల్ బ్రాంచ్ బృందానికి ‘బెస్ట్ ఎడ్యుకేషన్’ పురస్కారాన్ని అందజేసి అభినందించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సర్వాంగీణ వికాసానికి కృషి చేస్తున్నందుకు గాను ఈ గౌరవం దక్కిందని నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకలో నారాయణ సంస్థల జీఎం గోపాల్ రెడ్డి, డీజీఎం వెంకటరమణారెడ్డి, ఏజీఎం శ్రీనివాస్ రెడ్డి, హైస్కూల్ ఆర్ఎండీ అనిల్, ప్రిన్సిపాల్ నవనీత, కోఆర్డినేటర్ రవిశంకర్, హెచ్ఆర్ సతీష్, డీన్ వెంకన్న, ఏవో వెంకటేశం, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి