రూ.22 లక్షల పరిహారం.. తక్షణ సాయంగా రూ.10 లక్షలు.
కుటుంబంలో ఒకరికి ఉద్యోగం.. ఇందిరమ్మ ఇల్లు, తండ్రికి పెన్షన్.
ఎల్బీనగర్: ఆత్మహత్యకు పాల్పడిన కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హామీ ఇచ్చారు. ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్న సాయి కుటుంబసభ్యులు, బంధువులను ఆయన పరామర్శించి భరోసా కల్పించారు.
విధి నిర్వహణలో సాయిని ఇబ్బందులకు గురిచేశారన్న ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని పోలీస్ ఉన్నతాధికారులను ఎమ్మెల్యే కోరారు. బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మల్కాజ్గిరి సీపీ, డీసీపీతో మాట్లాడి సూచించారు.సాయి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వం నుంచి రూ.22 లక్షల పరిహారం, తక్షణ సాయంగా రూ.10 లక్షలు అందేలా చూస్తానన్నారు. కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతోపాటు సాయి తండ్రికి పెన్షన్ సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు.ఉద్యోగులకు వర్తించే రూ.కోటి బీమా సౌకర్యంపై ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా మాట్లాడి న్యాయం జరిగేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే, పోలీస్ ఉన్నతాధికారుల హామీతో సాయి కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన విరమించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి