Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ పరిశ్రమల్లో గిరిజన యువతకు ఉపాధి కల్పించాలి: చౌటుప్పల్ మున్సిపాలిటీ భాజపా ఫ్లోర్ లీడర్‌ బుడ్డ సురేష్ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 12, 2026 06:23 PM

కానిస్టేబుల్‌ సాయి కుటుంబానికి ఎమ్మెల్యే భరోసా.

కానిస్టేబుల్‌ సాయి కుటుంబానికి ఎమ్మెల్యే భరోసా.

కానిస్టేబుల్‌ సాయి కుటుంబానికి ఎమ్మెల్యే భరోసా.
12-08-2026 20 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రూ.22 లక్షల పరిహారం.. తక్షణ సాయంగా రూ.10 లక్షలు.

కుటుంబంలో ఒకరికి ఉద్యోగం.. ఇందిరమ్మ ఇల్లు, తండ్రికి పెన్షన్‌.

ఎల్బీనగర్‌: ఆత్మహత్యకు పాల్పడిన కానిస్టేబుల్‌ సాయి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి హామీ ఇచ్చారు. ఎల్బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆందోళన చేస్తున్న సాయి కుటుంబసభ్యులు, బంధువులను ఆయన పరామర్శించి భరోసా కల్పించారు.

విధి నిర్వహణలో సాయిని ఇబ్బందులకు గురిచేశారన్న ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని పోలీస్‌ ఉన్నతాధికారులను ఎమ్మెల్యే కోరారు. బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మల్కాజ్‌గిరి సీపీ, డీసీపీతో మాట్లాడి సూచించారు.సాయి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వం నుంచి రూ.22 లక్షల పరిహారం, తక్షణ సాయంగా రూ.10 లక్షలు అందేలా చూస్తానన్నారు. కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతోపాటు సాయి తండ్రికి పెన్షన్‌ సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు.ఉద్యోగులకు వర్తించే రూ.కోటి బీమా సౌకర్యంపై ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా మాట్లాడి న్యాయం జరిగేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే, పోలీస్‌ ఉన్నతాధికారుల హామీతో సాయి కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన విరమించారు.

Sthanikam

కానిస్టేబుల్‌ సాయి కుటుంబానికి ఎమ్మెల్యే భరోసా.

Article Image

రూ.22 లక్షల పరిహారం.. తక్షణ సాయంగా రూ.10 లక్షలు.

కుటుంబంలో ఒకరికి ఉద్యోగం.. ఇందిరమ్మ ఇల్లు, తండ్రికి పెన్షన్‌.

ఎల్బీనగర్‌: ఆత్మహత్యకు పాల్పడిన కానిస్టేబుల్‌ సాయి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి హామీ ఇచ్చారు. ఎల్బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆందోళన చేస్తున్న సాయి కుటుంబసభ్యులు, బంధువులను ఆయన పరామర్శించి భరోసా కల్పించారు.

విధి నిర్వహణలో సాయిని ఇబ్బందులకు గురిచేశారన్న ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని పోలీస్‌ ఉన్నతాధికారులను ఎమ్మెల్యే కోరారు. బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మల్కాజ్‌గిరి సీపీ, డీసీపీతో మాట్లాడి సూచించారు.సాయి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వం నుంచి రూ.22 లక్షల పరిహారం, తక్షణ సాయంగా రూ.10 లక్షలు అందేలా చూస్తానన్నారు. కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతోపాటు సాయి తండ్రికి పెన్షన్‌ సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు.ఉద్యోగులకు వర్తించే రూ.కోటి బీమా సౌకర్యంపై ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా మాట్లాడి న్యాయం జరిగేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే, పోలీస్‌ ఉన్నతాధికారుల హామీతో సాయి కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన విరమించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News