గిరిజన తండాల అభివృద్ధికి సీఎస్ఆర్ నిధులు కేటాయించాలి
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్కు వినతి
చౌటుప్పల్ మండల పరిధిలోని పరిశ్రమల్లో స్థానిక గిరిజన యువతీయువకులకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ ఎస్టీ కమీషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్కు చౌటుప్పల్ మున్సిపాలిటీ భాజపా ఫ్లోర్ లీడర్, కౌన్సిలర్ బుడ్డ సురేష్ వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్ సోమాజిగూడలోని దిల్ కుషా అతిథి గృహంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గిరిజన కాలనీలు, వివిధ వార్డులతో పాటు మారుమూల గిరిజన తండాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించేలా చూడాలని కమిషన్ సభ్యులను కోరారు. అలాగే, స్థానికంగా ఉన్న కంపెనీల సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులను సైతం గిరిజన ప్రాంతాల మౌలిక వసతుల కల్పనకు వెచ్చించేలా యాజమాన్యాలకు, సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి