రామన్నపేట: మండలంలోని నిదానపల్లి గ్రామంలో కొలువుదీరిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం ఆలయంలో స్వామివారికి విశేష పూజలు, అభిషేక కార్యక్రమాలు నిర్వహించగా భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
సాయంత్రం మాస కల్యాణోత్సవం.. అనంతరం అన్నప్రసాద వితరణ.
ప్రదోష వేళ అమావాస్య సందర్భంగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు మల్లికార్జున స్వామివారి సన్నిధిలో మాస కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు బేతాజీ శశిధర్ దీక్షితులు తెలిపారు. కల్యాణోత్సవం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు.
ప్రతి అమావాస్య సందర్భంగా స్వామివారి కల్యాణోత్సవాన్ని నిర్వహించడంతో పాటు అన్నదాన కార్యక్రమం చేపడుతున్నామని అర్చకులు తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించి, అన్నప్రసాదాన్ని స్వీకరించి తరించాలని ఆలయ అర్చకులు కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి