Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇవ్వాలి ​– సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎండి పాషా పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 12, 2026 04:46 PM

అమావాస్య.. మల్లన్న గుట్టపై ఘనంగా ప్రత్యేక పూజలు.

అమావాస్య.. మల్లన్న గుట్టపై ఘనంగా ప్రత్యేక పూజలు.

అమావాస్య.. మల్లన్న గుట్టపై ఘనంగా ప్రత్యేక పూజలు.
12-08-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: మండలంలోని నిదానపల్లి గ్రామంలో కొలువుదీరిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం ఆలయంలో స్వామివారికి విశేష పూజలు, అభిషేక కార్యక్రమాలు నిర్వహించగా భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

సాయంత్రం మాస కల్యాణోత్సవం.. అనంతరం అన్నప్రసాద వితరణ.

ప్రదోష వేళ అమావాస్య సందర్భంగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు మల్లికార్జున స్వామివారి సన్నిధిలో మాస కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు బేతాజీ శశిధర్ దీక్షితులు తెలిపారు. కల్యాణోత్సవం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు.

ప్రతి అమావాస్య సందర్భంగా స్వామివారి కల్యాణోత్సవాన్ని నిర్వహించడంతో పాటు అన్నదాన కార్యక్రమం చేపడుతున్నామని అర్చకులు తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించి, అన్నప్రసాదాన్ని స్వీకరించి తరించాలని ఆలయ అర్చకులు కోరారు.

Sthanikam

అమావాస్య.. మల్లన్న గుట్టపై ఘనంగా ప్రత్యేక పూజలు.

Article Image

రామన్నపేట: మండలంలోని నిదానపల్లి గ్రామంలో కొలువుదీరిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం ఆలయంలో స్వామివారికి విశేష పూజలు, అభిషేక కార్యక్రమాలు నిర్వహించగా భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

సాయంత్రం మాస కల్యాణోత్సవం.. అనంతరం అన్నప్రసాద వితరణ.

ప్రదోష వేళ అమావాస్య సందర్భంగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు మల్లికార్జున స్వామివారి సన్నిధిలో మాస కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు బేతాజీ శశిధర్ దీక్షితులు తెలిపారు. కల్యాణోత్సవం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు.

ప్రతి అమావాస్య సందర్భంగా స్వామివారి కల్యాణోత్సవాన్ని నిర్వహించడంతో పాటు అన్నదాన కార్యక్రమం చేపడుతున్నామని అర్చకులు తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించి, అన్నప్రసాదాన్ని స్వీకరించి తరించాలని ఆలయ అర్చకులు కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News