దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో జీవిస్తూ స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా స్వావలంబన సాధించేలా సెర్ప్, డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ సంయుక్తంగా కృషి చేస్తున్నాయని ఫౌండేషన్ టెరిటరీ మేనేజర్ రవిప్రకాష్ తెలిపారు. కంది మండలానికి చెందిన దివ్యాంగులకు సంగారెడ్డిలో స్వయం ఉపాధి అవకాశాలు, వ్యాపార నిర్వహణ, ఆర్థిక ప్రణాళిక, మార్కెటింగ్ పద్ధతులు, చిన్న వ్యాపారాల అభివృద్ధిపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగులు తమ నైపుణ్యాలను పెంపొందించుకొని స్వంతంగా వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా ఎదగాలని నిర్వాహకులు సూచించారు.ప్రభుత్వ పథకాలు, స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు. అనంతరం డీఆర్డీఏ కంది మండల సమాఖ్య ఏపీఎం శివలక్ష్మి దివ్యాంగుల అభివృద్ధికి సంస్థ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. అనంతరం దివ్యాంగులకు స్వయం ఉపాధి కోసం గ్రాంట్ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ సంగారెడ్డి జిల్లా క్లస్టర్ కోఆర్డినేటర్లు జె. శ్రీకాంత్, ప్రశాంత్, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అనిత, క్లస్టర్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
దివ్యాంగుల ఆర్థికాభివృద్ధికి సెర్ప్, డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ కృషి
దివ్యాంగుల ఆర్థికాభివృద్ధికి సెర్ప్, డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ కృషి
Krishna
దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో జీవిస్తూ స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా స్వావలంబన సాధించేలా సెర్ప్, డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ సంయుక్తంగా కృషి చేస్తున్నాయని ఫౌండేషన్ టెరిటరీ మేనేజర్ రవిప్రకాష్ తెలిపారు. కంది మండలానికి చెందిన దివ్యాంగులకు సంగారెడ్డిలో స్వయం ఉపాధి అవకాశాలు, వ్యాపార నిర్వహణ, ఆర్థిక ప్రణాళిక, మార్కెటింగ్ పద్ధతులు, చిన్న వ్యాపారాల అభివృద్ధిపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగులు తమ నైపుణ్యాలను పెంపొందించుకొని స్వంతంగా వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా ఎదగాలని నిర్వాహకులు సూచించారు.ప్రభుత్వ పథకాలు, స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు. అనంతరం డీఆర్డీఏ కంది మండల సమాఖ్య ఏపీఎం శివలక్ష్మి దివ్యాంగుల అభివృద్ధికి సంస్థ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. అనంతరం దివ్యాంగులకు స్వయం ఉపాధి కోసం గ్రాంట్ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ సంగారెడ్డి జిల్లా క్లస్టర్ కోఆర్డినేటర్లు జె. శ్రీకాంత్, ప్రశాంత్, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అనిత, క్లస్టర్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి