Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెద్దమ్మగుడి రంగుల కోసం రూ.10 వేల ఆర్థిక సహాయం పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 11, 2026 06:18 PM

గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం

గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం

గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం
11-08-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

గర్భధారణ సమయంలో మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సరైన పోషకాహారంతో పాటు వైద్యుల సలహాలు తప్పనిసరిగా పాటించాలని ప్రముఖ వైద్యులు సూచించారు. మంగళవారం చౌటుప్పల్ మున్సిపాలిటీలోని కళాశ్రీ ఫంక్షన్ హాల్‌లో లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవ ఆధ్వర్యంలో గర్భిణులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.​ లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఎండి అత్ హర్ పాషా అధ్యక్షత వహించగా.. చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దాచేపల్లి ప్రకాష్ గుప్తా, రీజియన్ చైర్‌పర్సన్ సంజీవరెడ్డి, జోన్ చైర్మన్ ఉప్పు ఆంజనేయులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.​సదస్సులో వైద్యులు డాక్టర్ వై. సూర్యశ్రీ, డాక్టర్ ప్రశాంతి రెడ్డి, డాక్టర్ అవ్వరు శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ.. గర్భిణులు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ఐరన్, ఫోలిక్ యాసిడ్, క్యాల్షియం మాత్రలు వాడాలని సూచించారు. పరిశుభ్రమైన నీరు, తగినంత విశ్రాంతి తల్లి-బిడ్డల ఆరోగ్యానికి ఎంతో అవసరమని తెలిపారు. అధిక రక్తపోటు, తీవ్రమైన తలనొప్పి, కాళ్ల వాపులు లేదా బిడ్డ కదలికలు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని హెచ్చరించారు. సురక్షిత ప్రసవం కోసం కుటుంబ సభ్యుల సహకారం చాలా కీలకమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి దాచేపల్లి రాజు గుప్తా, కోశాధికారి బత్తిని రఘు, నాంపల్లి రమేష్ గుప్తా, తిరందాసు జగన్ నాథ్, కాసుల వెంకటేశం గౌడ్, కామిశెట్టి చంద్రశేఖర్ గుప్తా, గొప గోని లక్ష్మణ్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, సిలివేరు మంగయ్య, వనం రాజు, సంపూర్ణ చారి, పోలోజు రాజు, పోలోజు శ్రీనివాస చారి, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం

Article Image

లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

గర్భధారణ సమయంలో మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సరైన పోషకాహారంతో పాటు వైద్యుల సలహాలు తప్పనిసరిగా పాటించాలని ప్రముఖ వైద్యులు సూచించారు. మంగళవారం చౌటుప్పల్ మున్సిపాలిటీలోని కళాశ్రీ ఫంక్షన్ హాల్‌లో లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవ ఆధ్వర్యంలో గర్భిణులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.​ లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఎండి అత్ హర్ పాషా అధ్యక్షత వహించగా.. చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దాచేపల్లి ప్రకాష్ గుప్తా, రీజియన్ చైర్‌పర్సన్ సంజీవరెడ్డి, జోన్ చైర్మన్ ఉప్పు ఆంజనేయులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.​సదస్సులో వైద్యులు డాక్టర్ వై. సూర్యశ్రీ, డాక్టర్ ప్రశాంతి రెడ్డి, డాక్టర్ అవ్వరు శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ.. గర్భిణులు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ఐరన్, ఫోలిక్ యాసిడ్, క్యాల్షియం మాత్రలు వాడాలని సూచించారు. పరిశుభ్రమైన నీరు, తగినంత విశ్రాంతి తల్లి-బిడ్డల ఆరోగ్యానికి ఎంతో అవసరమని తెలిపారు. అధిక రక్తపోటు, తీవ్రమైన తలనొప్పి, కాళ్ల వాపులు లేదా బిడ్డ కదలికలు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని హెచ్చరించారు. సురక్షిత ప్రసవం కోసం కుటుంబ సభ్యుల సహకారం చాలా కీలకమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి దాచేపల్లి రాజు గుప్తా, కోశాధికారి బత్తిని రఘు, నాంపల్లి రమేష్ గుప్తా, తిరందాసు జగన్ నాథ్, కాసుల వెంకటేశం గౌడ్, కామిశెట్టి చంద్రశేఖర్ గుప్తా, గొప గోని లక్ష్మణ్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, సిలివేరు మంగయ్య, వనం రాజు, సంపూర్ణ చారి, పోలోజు రాజు, పోలోజు శ్రీనివాస చారి, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News