మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని, డ్రగ్స్కు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని చౌటుప్పల్ సీఐ జి. మన్మథ కుమార్ పిలుపునిచ్చారు. తంగడపల్లి గ్రామంలో చౌటుప్పల్ పోలీసుల ఆధ్వర్యంలో 'యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్' నిర్వహించారు. మత్తు పదార్థాల వల్ల ఆరోగ్యం క్షీణించడమే కాకుండా, కుటుంబాలు రోడ్డున పడతాయని సీఐ మన్మథ కుమార్, ఎస్సై కె. యాదగిరి స్పష్టం చేశారు. డ్రగ్స్ లేని సమాజ నిర్మాణాకి యువత ముందుండాలని, తమ భవిష్యత్తును నాశనం చేసే అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. గ్రామంలో మత్తు పదార్థాల విక్రయం లేదా వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే అందించాలని, డ్రగ్స్ నిర్మూలనకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు, పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు.
PRINT TIME: August 10, 2026 08:38 PM
డ్రగ్స్కు దూరంగా ఉండి ఉజ్జ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలి: సీఐ మన్మధకుమార్
డ్రగ్స్కు దూరంగా ఉండి ఉజ్జ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలి: సీఐ మన్మధకుమార్
10-08-2026
19 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని, డ్రగ్స్కు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని చౌటుప్పల్ సీఐ జి. మన్మథ కుమార్ పిలుపునిచ్చారు. తంగడపల్లి గ్రామంలో చౌటుప్పల్ పోలీసుల ఆధ్వర్యంలో 'యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్' నిర్వహించారు. మత్తు పదార్థాల వల్ల ఆరోగ్యం క్షీణించడమే కాకుండా, కుటుంబాలు రోడ్డున పడతాయని సీఐ మన్మథ కుమార్, ఎస్సై కె. యాదగిరి స్పష్టం చేశారు. డ్రగ్స్ లేని సమాజ నిర్మాణాకి యువత ముందుండాలని, తమ భవిష్యత్తును నాశనం చేసే అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. గ్రామంలో మత్తు పదార్థాల విక్రయం లేదా వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే అందించాలని, డ్రగ్స్ నిర్మూలనకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు, పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి