ఇంద్రపాలనగరం: గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ ఇంద్రపాల ముత్యాలమ్మ తల్లి దేవాలయం అభివృద్ధిపై సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ప్రత్యేక దృష్టి సారించారు. ఆలయం ముందు ఉన్న కాల్వలో సిమెంట్ ఆర్సీసీ పైపులు ఏర్పాటు చేసి, కాల్వను అండర్గ్రౌండ్గా మార్చే పనులను శరవేగంగా చేపట్టారు.
ఆలయం ముందు భక్తులకు విశాలమైన స్థలం, పార్కింగ్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ అభివృద్ధి పనులు చేపట్టినట్లు సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో అవసరమైన చర్యలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.
ఈ పనుల్లో వడ్లకొండ బిక్షపతి, బొల్ల మత్స్యగిరి, కనకబోయిన లింగస్వామి, నీరుడు వెంకటేష్, మేకల నరేందర్, పుట్టాల నాగరాజు, వడ్లకొండ చింటూ, గార్ధాస్ సాయి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి